YS Sharmila: మరోసారి నిరంజన్రెడ్డిపై వైఎస్ షర్మిల ఫైర్.. ఈయన కన్నీళ్ల నిరంజన్ రెడ్డి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… మంత్రి నిరంజన్రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది… నిన్న వైఎస్ షర్మిల చేసిన కామెంట్లకు ఇవాళ మంత్రి నిరంజన్రెడ్డి కౌంటర్ ఇస్తే… ఇక, ఇవాళ మరోసారి ఓ రేంజ్లో నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు షర్మిల.. వైఎస్సార్ ది రక్త చరిత్ర అని మాట్లాడాడు అంట.. అసలు వైఎస్సార్ చరిత్ర ఎంటో నిరంజన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు.. ఒక్క సారి కాదు.. లక్షా సార్లు మాట్లాడినా అబద్ధం నిజం అవ్వదని హితవుపలికిన ఆమె… వైఎస్సార్ ఐదేళ్ల పాలన చేస్తే ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేసిన చరిత్ర ఆయనది అన్నారు.. సిగ్గుమాలిన నిరంజన్ రెడ్డి ఈ విషయాలు తెలుసుకోవాలని సూచించారు. సిగ్గు, ఇంగితం, బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం బ్రతుకు నిరంజన్ రెడ్డి.. లేకుంటే చీపురుతో కొట్టండి.. కర్రు కాల్చి వాత పెట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.. ఈయన కన్నీళ్ల నిరంజన్ రెడ్డి.. ఈయనను మోసగాడు అనాలి అని పేర్కొన్నారు. ఇక, ఈ నెల 14 న 24 గంటల పాటు పాలమూరు ప్రాజెక్ట్ కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు వైఎస్ షర్మిల..
Read Also: KTR: నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం.. అదే కారణమని కేటీఆర్ ఫైర్
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
కాగా, గతంలో తనపై నిరంజన్రెడ్డి చేసిన విమర్శలపై స్పందిస్తూ.. గట్టిగా కౌంటరిచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. తనను మంగళవారం మరదలన్నాడని.. ఎవడ్రా నువ్వు, నీకు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అంటూ ఫైరయ్యారు. ఈయనకు కుక్కకు ఏమైనా తేడా వుందా? అంటూ ప్రశ్నించిన ఆమె.. అధికార మదం తలకెక్కిందా… నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నిరంజన్ రెడ్డి.. తెలంగాణలో కొందరు అహంకారంతో యాత్రలు చేస్తున్నారు.. అడ్డగోలుగా దోచుకున్న అక్రమ సొమ్ముతో కిరాయికి పూలు చల్లించుకుంటూ.. కిరాయి మనుషులతో.. కిరాయి యాత్రలు చేస్తున్నారు అంటూ వైఎస్ షర్మిలపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక దేశంలోని కొన్ని శక్తులు తెలంగాణ మీదకు కొందరిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. 22 ఏండ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల మధ్యన ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారున్ని.. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అంటూ ఫైర్ అయ్యారు.. వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని తాను అన్నారు.. ఇక, రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటీచేసి నీ సత్తా ఏంటో చూయించు అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!