KTR: నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం.. అదే కారణమని కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూకల ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం.. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.. వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినా.. ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయని స్పష్టం చేసింది.. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, కేంద్రం తాజాగా నిర్ణయంపై సీరియస్గా స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతోనే దేశంలో ప్రస్తుతం ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది మండిపడ్డారు.. నరేంద్ర మోడీ సర్కార్ కు ముందుచూపు లేకపోవడంతో ప్రమాదంలో దేశ ఆహార భద్రత అని పేర్కొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత ఆలోచనలతో ఆహార ధాన్యాలను కొనకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
Read Also: Ganesh Laddu Rs. 46 lakh: బాలాపూర్ గణేష్ రికార్డు బ్రేక్.. రూ.46 లక్షలు పలికిన గణపతి లడ్డూ..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఇక, తెలంగాణ విఫలమైందని చూపే ప్రయత్నంలో నరేంద్ర మోడీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఆరోపించారు కేటీఆర్.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల కిందట తాము కోరితే.. దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం తిరస్కరించిందని.. ప్రస్తుతం కొరతకు కారణమేంటో చెప్పాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను డిమాండ్ చేశారు. దేశంలో నాలుగేళ్ల వరకు సరిపోయే నిల్వలు ఉన్నాయని చెప్పారు.. నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరు నెలల క్రితం గొప్పగా చెప్పిన కేంద్ర సర్కార్.. తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందని మండిపడ్డారు.. ఎఫ్సీఐ గోదాముల్లో, ఇతర కేంద్రాల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ఆహార ధాన్యాల కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం “వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్” అనుసరించాలని సూచించిన ఆయన.. తెలంగాణలో పుట్లకొద్దీ పండిన ధాన్యాన్ని కొనకుండా దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందన్నారు.. ఇప్పటికైనా దేశ ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!