తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి వరకు పార్టీలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు వైఎస్ షర్మిల వెల్లడించారు. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా ఇంఛార్జులను నియమించగా.. ఇప్పుడు ఆ కమిటీలన్నీ రద్దు చేయడం హాట్ టాపిక్గా మారింది.
Read Also: కరోనా ఎఫెక్ట్ : గణతంత్ర వేడుకల వేదిక మార్పు
గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్గా వడుక రాజగోపాల్, రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్గా ఎడమ మోహన్ రెడ్డి, ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్గా గడిపల్లి కవిత, వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్గా తమ్మాలి బాలరాజ్, నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్గా ఇంజం నర్సిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కో ఆర్డినేటర్గా మహమ్మద్ అత్తార్ ఖాన్, ములుగు జిల్లా కో ఆర్డినేటర్గా రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్గా నాడెం శాంతికుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కో ఆర్డినేటర్గా అప్పం కిషన్, నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్గా నీలం రమేశ్, ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్గా బెజ్జంకి అనిల్ కుమార్ను వైఎస్ షర్మిల నియమించారు.