PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర
- రథయాత్ర భారత సంస్కృతికి ప్రతీక
- దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రథయాత్రను భారతదేశ శాశ్వత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రకాశవంతమైన ప్రతీకగా అభివర్ణించారు. మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, దేశంలో ఐక్యత, సంతోషం, శ్రేయస్సు మరింత పెరగాలని ఆకాంక్షించారు.
రథయాత్ర భారత సంస్కృతికి ప్రతీక: ప్రధాని మోడీ
రథయాత్ర సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. “రథయాత్ర పవిత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇది భారతదేశ శాశ్వత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రకాశవంతమైన ప్రతీక. రథయాత్ర సంప్రదాయాలు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తరతరాల ప్రజలను ప్రేరేపించాయి. వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవ వంటి విలువలను ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. అలాగే మహాప్రభు జగన్నాథుడు అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, సమాజంలో ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రార్థించారు.
Also Read
- Gallantry Awards 2026: వీర సైనికులకు గొప్ప గౌరవం.. శౌర్య, కీర్తి చక్ర సహా 78 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం
- Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ విదేశాల్లోని జగన్నాథ భక్తులకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు. భక్తుడు, భగవంతుని కలయికకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవం ఎంతో విశిష్టమైనదని ఆమె పేర్కొన్నారు. మహాప్రభు జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథయాత్ర ద్వారా భక్తుల వద్దకు రావడం భక్తి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఘట్టమని ఆమె అన్నారు. దేశంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి నిరంతరం కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.
పూరీలో రథయాత్రకు సర్వం సిద్ధం
పూరీ జగన్నాథ ఆలయంలోని సింహద్వారం వద్ద జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి కోసం రూపొందించిన మూడు రథాలు సిద్ధంగా ఉంచారు.
నందిఘోష – శ్రీ జగన్నాథ స్వామివారి రథం
తాళధ్వజ – బలభద్రుడి రథం
దర్పదళన – సుభద్ర అమ్మవారి రథం
ప్రతి ఏడాది నిర్వహించే ఈ రథయాత్రను లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పూరీకి చేరుకుంటారు.
పూరీలో కట్టుదిట్టమైన భద్రత
భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పూరీ నగరంలో బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 13,000 మంది పోలీసు సిబ్బంది, 15 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, NSG కమాండోలు, సముద్ర తీరంలో 500 మంది లైఫ్గార్డులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, ఒడిశా మెరైన్ పోలీసు బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి.
డ్రోన్లతో నిఘా
జనసందోహాన్ని నియంత్రించేందుకు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. భద్రతను మరింత బలోపేతం చేసేందుకు డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భూమి, సముద్రం, గగనతలం నుంచి నిఘా కొనసాగిస్తున్నట్లు ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
లక్షలాది మంది భక్తుల రాక
హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగల్లో ఒకటైన పూరీ జగన్నాథ రథయాత్రకు ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ପବିତ୍ର ରଥଯାତ୍ରା ଅବସରରେ ସମସ୍ତଙ୍କୁ ଶୁଭେଚ୍ଛା । ଏହା ଭାରତର କାଳଜୟୀ ଆଧ୍ୟାତ୍ମିକ ଏବଂ ସାଂସ୍କୃତିକ ଐତିହ୍ୟର ଏକ ଅନନ୍ୟ ଅଭିବ୍ୟକ୍ତି । ରଥଯାତ୍ରା ସହ ଜଡିତ ପରମ୍ପରା ଭାରତ ଏବଂ ବିଶ୍ୱର ଅନେକ ପିଢ଼ିକୁ ପ୍ରେରଣା ଦେଇଛି । ଏହା ବିନମ୍ରତା, ସାମୂହିକ ଅଂଶଗ୍ରହଣ ଏବଂ ନିଃସ୍ୱାର୍ଥପର ସେବାକୁ ପ୍ରତିଫଳିତ କରେ ।
ମହାପ୍ରଭୁ ଜଗନ୍ନାଥ…
— Narendra Modi (@narendramodi) July 16, 2026
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!