Youth Congress: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youth Congress: తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంచెలంచెలుగా అసెంబ్లీకి రావడంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే.. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Read also: Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
శాసనసభ ప్రారంభమైన వెంటనే కొద్ది నెలల క్రితం మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించారు. శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నాలుగు దశాబ్దాలుగా శాసనసభ్యునిగా, అనేక హోదాల్లో రాజకీయాల్లో పనిచేశానన్నారు. వ్యక్తిగతంగా తనకు మంచి అనుబంధం ఉందన్నారు. సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటన్నారు.సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారన్నారు. పలు సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. కంటోన్మెంట్లను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందన్న శుభవార్త తాజాగా అందిందని అన్నారు. సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంతాప తీర్మానంపై పలువురు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు కూడా మాట్లాడారు.
Jagananna Suraksha : ముగిసిన జగనన్న సురక్షా క్యాంపైన్
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!