Youth Congress: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youth Congress: తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంచెలంచెలుగా అసెంబ్లీకి రావడంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే.. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Read also: Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
శాసనసభ ప్రారంభమైన వెంటనే కొద్ది నెలల క్రితం మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించారు. శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నాలుగు దశాబ్దాలుగా శాసనసభ్యునిగా, అనేక హోదాల్లో రాజకీయాల్లో పనిచేశానన్నారు. వ్యక్తిగతంగా తనకు మంచి అనుబంధం ఉందన్నారు. సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటన్నారు.సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారన్నారు. పలు సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. కంటోన్మెంట్లను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందన్న శుభవార్త తాజాగా అందిందని అన్నారు. సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంతాప తీర్మానంపై పలువురు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు కూడా మాట్లాడారు.
Jagananna Suraksha : ముగిసిన జగనన్న సురక్షా క్యాంపైన్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!