వడ్ల సేకరణ విషయంలో కేంద్రానిది ఘోర వైఫల్యమని, పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదన్నారు. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి ఇప్పుడు చేతులెత్తే సిందన్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్కు ప్రోత్సామం ఇచ్చినందునే దేశంలో ఎన్నో మిల్లులు ఏర్పడ్డాయన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా, సంస్కారహీనంగా మాట్లాడింది, నిందించింది బీజేపీ నేతలు, ఎంపీలన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి బెదిరిస్తున్నారని, సమస్యను పక్కదారి పట్టించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ బెదిరింపుల విషయం దేశమంత తెలుసనని మంత్రి అన్నారు. స్వయంగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పలు మార్లు ట్విట్టర్లో, మీడియాలో బీజేపీ ప్రభుత్వ వైఖరి వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొన్న వెంటనే రైతుకు డబ్బులు ఇస్తుంది .. ఆరు నెలల వరకు జరిగే నష్టం, వడ్డీ తెలంగాణ ప్రభు త్వం భరిస్తుంది .. దానిని భరించాలని కేంద్రాన్ని కోరినా ఇంతవరకు చలనం లేదన్నారు. ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైతు లు కేంద్రం సహకారం లేకుండా పండిస్తున్న పంటకు చేయూత ఇవ్వ రా ? తెలంగాణలో యాసంగి వడ్లన్నీ బాయిల్డ్ రైస్ కోసమే వేస్తా రు.ఈ విషయం తెలంగాణలో సామాన్య రైతుకు కూడా తెలుసు.
దేశం లో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతారు, వరి ధాన్యం పండించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు చెబు తాడు .. వీరి ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా వ్యవహరి స్తాడ న్నారు. తెలంగాణ రైతుల యాసంగి వడ్లు కొంటరా ? కొనరా ? కేంద్ర మంత్రి గా, తెలంగాణ వాసిగా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని మం త్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్లో జరిగే పరి ణామాలకు మీరే బాధ్యత వహించాలన్నారు. మీ కేంద్ర ప్రభుత్వ వైఖ రిని మీరు తెలంగాణ రైతులకు వివరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ పై ఫైర్ అయ్యారు.