పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వడ్ల సేకరణ విషయంలో కేంద్రానిది ఘోర వైఫల్యమని, పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదన్నారు. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి ఇప్పుడు చేతులెత్తే సిందన్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్కు ప్రోత్సామం ఇచ్చినందునే దేశంలో ఎన్నో మిల్లులు ఏర్పడ్డాయన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా, సంస్కారహీనంగా మాట్లాడింది, నిందించింది బీజేపీ నేతలు, ఎంపీలన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి బెదిరిస్తున్నారని, సమస్యను పక్కదారి పట్టించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ బెదిరింపుల విషయం దేశమంత తెలుసనని మంత్రి అన్నారు. స్వయంగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పలు మార్లు ట్విట్టర్లో, మీడియాలో బీజేపీ ప్రభుత్వ వైఖరి వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొన్న వెంటనే రైతుకు డబ్బులు ఇస్తుంది .. ఆరు నెలల వరకు జరిగే నష్టం, వడ్డీ తెలంగాణ ప్రభు త్వం భరిస్తుంది .. దానిని భరించాలని కేంద్రాన్ని కోరినా ఇంతవరకు చలనం లేదన్నారు. ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైతు లు కేంద్రం సహకారం లేకుండా పండిస్తున్న పంటకు చేయూత ఇవ్వ రా ? తెలంగాణలో యాసంగి వడ్లన్నీ బాయిల్డ్ రైస్ కోసమే వేస్తా రు.ఈ విషయం తెలంగాణలో సామాన్య రైతుకు కూడా తెలుసు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
దేశం లో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతారు, వరి ధాన్యం పండించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు చెబు తాడు .. వీరి ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా వ్యవహరి స్తాడ న్నారు. తెలంగాణ రైతుల యాసంగి వడ్లు కొంటరా ? కొనరా ? కేంద్ర మంత్రి గా, తెలంగాణ వాసిగా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని మం త్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్లో జరిగే పరి ణామాలకు మీరే బాధ్యత వహించాలన్నారు. మీ కేంద్ర ప్రభుత్వ వైఖ రిని మీరు తెలంగాణ రైతులకు వివరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ పై ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!