Pet Dog Bite: మన కుక్కే కదా అనుకుంది.. కరవడంతో కాటికి వెళ్లింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pet Dog Bite: కుక్కకాటును నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. తనను కరిచింది పెంపుడు కుక్క కదా అని నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో చోటుచేసుకుంది.
ఎలగందుల రాజు, జ్యోతి దంపతులు ఆలేరుకు చెందినవారు. తమ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు. అయితే రెండు నెలల కిందటే తన పెంపుడు కుక్క జ్యోతిని కరిచింది. అయితే కుక్క కాటును పట్టించుకోలేదు. వీధి కుక్క అయితే భయపడచ్చుకానీ.. మన కుక్కే కదా అంటూ నిర్లక్ష్యం చేసింది. ఆమె నిర్లక్ష్యం ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. గత కొద్దిరోజులుగా జ్యోతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కుక్కలా ప్రవర్తిస్తూ అరవడం మొదలుపెట్టింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం (జూలై 9) ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు.
Also Read
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
Read also: Rahul Gandhi: కొత్త ఇంటికి మారనున్న రాహుల్ గాంధీ..! ఇల్లు, ఆఫీస్ ఒకే దగ్గర..
సోమవారం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి మృతి చెందింది. జ్యోతికి ఇద్దరు కుమారులు, భర్త ఉండగా.. ఇంటి కుక్క పట్టించుకోకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కక్కు కాట్లను నిర్లక్ష్యం చేయడం సరికాదంటున్నారు వైద్యులు. వీధికుక్కలు, పెంపుడు కుక్కలు కాటేస్తే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కుక్క కరిచినప్పుడు, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. గాయాలు తగ్గి పూర్తిగా మాయమయ్యే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుక్క కాటుకు గురైన వ్యక్తులు వెంటనే నీరు లేదా మద్యంతో కాటు వేసిన ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రవంలో ఒకటి లేదా రెండు చుక్కలు సిఫార్సు చేయబడ్డాయి. ఆ తర్వాత సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నారు. లోతైన గాయాలను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Burns: కాలిన గాయాలను వెంటనే తగ్గించే సూపర్ చిట్కాలు..
తాజావార్తలు
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..