Hyderabad: గుడ్ న్యూస్.. ఈనెల 24 నుంచి బేగంపేటలో ఎయిర్షో
హైదరాబాద్ నగరంలో అందరూ ఎదురుచూస్తున్న ఎయిర్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్టు వేదికగా పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రదర్శనలో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రదర్శనలను వీక్షించాలని భావించేవారు వింగ్స్ ఇండియా వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించామని అధికారులు తెలిపారు. తొలి మూడురోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.
Also Read
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!