Bandi Sanjay: హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకు..?
- ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి..
- హిందువుల పండుగలకే ఆంక్షలు.. నిబంధనలు ఎందుకు..
- కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవం జరపలేదు: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండిసంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. హిందువుల పండుగులకే ఆంక్షలు, బంధనలు ఎందుకు అని ప్రశ్నించారు. సెప్టెంబరు 17వ తేదీన నరేంద్ర మోడి పుట్టినరోజు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలలో జరుపుకోవాలన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం.. తెలంగాణకి స్వాతంత్ర్యం వచ్చినరోజు అన్నారు. రజాకార్ల అరచకాలని మనం ఎప్పుడూ మరిచిపోలేం.. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపడం లేదని విమర్శించారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబర్ 17ని జరపడం లేదన్నారు. వీరుల బలిదానాలని, త్యాగాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ మరిచిపోతున్నాయని బండి సంజయ్ అన్నారు.
Read Also: Drug Seize : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో రూ.25కోట్లు విలువ చేసే డ్రగ్స్ సీజ్
Also Read
- Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఇక, అసదుద్దీన్ ఓవైసీపీ పేదల గొంతుక ఎలా అవుతాడని రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరికి సేవ చేసాడు, ఓవైసీ కాలేజీని హైడ్రా ఎప్పుడు కూల్చుతుంది అని అడిగారు. ఎవరూ అధికారంలో ఉంటే వారి సంకలోకి వచ్చి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం.. మేమంతా సర్దార్ పటేల్ వారసులం.. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆగష్టు 15 లాగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ఆయన అన్నారు. మొన్నటిదాక హైడ్రా లొల్లి, ఇప్పుడు విగ్రహాల లొల్లి.. ఆరు గ్యారంటీల అమలు నుంచి దృష్టి మరల్చడానికే ఈ విగ్రహాల లొల్లి అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు బీఆర్ఎస్ చేతిలో ఉంది.. ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ చేతిలో ఉంది.. అందుకే లోపాయకారి ఒప్పిందం చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే ఒప్పుకోం.. తెలంగాణ విమోచన దినోత్సవం అనడానికి కాంగ్రెస్ కి భయమెందుకు అని బండి సంజయ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!