Bandi Sanjay: హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకు..?
- ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి..
- హిందువుల పండుగలకే ఆంక్షలు.. నిబంధనలు ఎందుకు..
- కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవం జరపలేదు: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండిసంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. హిందువుల పండుగులకే ఆంక్షలు, బంధనలు ఎందుకు అని ప్రశ్నించారు. సెప్టెంబరు 17వ తేదీన నరేంద్ర మోడి పుట్టినరోజు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలలో జరుపుకోవాలన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం.. తెలంగాణకి స్వాతంత్ర్యం వచ్చినరోజు అన్నారు. రజాకార్ల అరచకాలని మనం ఎప్పుడూ మరిచిపోలేం.. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపడం లేదని విమర్శించారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబర్ 17ని జరపడం లేదన్నారు. వీరుల బలిదానాలని, త్యాగాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ మరిచిపోతున్నాయని బండి సంజయ్ అన్నారు.
Read Also: Drug Seize : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో రూ.25కోట్లు విలువ చేసే డ్రగ్స్ సీజ్
Also Read
ఇక, అసదుద్దీన్ ఓవైసీపీ పేదల గొంతుక ఎలా అవుతాడని రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరికి సేవ చేసాడు, ఓవైసీ కాలేజీని హైడ్రా ఎప్పుడు కూల్చుతుంది అని అడిగారు. ఎవరూ అధికారంలో ఉంటే వారి సంకలోకి వచ్చి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం.. మేమంతా సర్దార్ పటేల్ వారసులం.. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆగష్టు 15 లాగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ఆయన అన్నారు. మొన్నటిదాక హైడ్రా లొల్లి, ఇప్పుడు విగ్రహాల లొల్లి.. ఆరు గ్యారంటీల అమలు నుంచి దృష్టి మరల్చడానికే ఈ విగ్రహాల లొల్లి అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు బీఆర్ఎస్ చేతిలో ఉంది.. ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ చేతిలో ఉంది.. అందుకే లోపాయకారి ఒప్పిందం చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే ఒప్పుకోం.. తెలంగాణ విమోచన దినోత్సవం అనడానికి కాంగ్రెస్ కి భయమెందుకు అని బండి సంజయ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!