Manda Krishna Madiga: నిధులు కేటాయించక పోతే సీఎం, కేటీఆర్ ఇలాఖాలో ధర్నా చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Krishna Madiga: అనాధల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలి లేక పోతే సీఎం కేసీఆర్, కేటీఆర్ నియోజక వర్గాలలో ధర్నాలు చేస్తామని Mrps రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించాన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమంపై మండిపడ్డారు. అనాధల జీవితాలలో చాలా చీకట్లు వున్నాయని, అనాధల సంక్షేమం పై సీఎం, కేటీఆర్ ఇచ్చిన హామీలు మీద తీర్మానాల మీద ఏమయ్యాయో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కి ఆనాధల సంక్షేమం విషయంలో గుర్తు చేయటానికి వచ్చానని తెలిపారు. ఏడు సంవత్సరాల ఏడు నెలల 14 రోజుల కింద తల్లి తండ్రులు కొల్పయిన వారికి సంక్షేమం కింద ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు కాలేదు అనాద ఆశ్రమాలను ఒక్కసారి కూడా సందర్శించలేదన్నారు. మొదటి రెసిడెన్షియల్ స్కూల్ ను అనాధల కోసం జిల్లాకు ఒకటి ప్రారంభిస్తామన్నారు.
Read also: Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ఇప్పటి వరకు ఒక్కటి కుడా ప్రారంభించకుండా, ఆ హామీని విస్మరించారని ఆరోపించారు. సీఎం లాగానే హామీలను కేటీఆర్ కూడా విస్మరించి కేసీఆర్ లాగే నడుస్తున్నడా..? అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ఎప్పుడు దేశం గర్వించే విధంగా అనాధల కోసం చట్టం తెస్తాం అన్నారు కానీ ఇప్పటి వరకు తీసుకు రాలేదన్నారు. అనాధల కు తల్లితండ్రులు తెలియదు, కులం తెలియదు. ఆలాంటి వారికి కుల ధృవీకరణ పత్రాలు లేవన్నారు. వారికి ప్రత్యేక స్మార్ట్ కార్డ్ లు ఇస్తామని కేటీఆర్ అన్నారు కానీ ఇప్పటి వరకు తీసుకు రాలేదని గుర్తు చేశారు. అనాధల మానవ అక్రమ రవాణా జరుగుతుంది అని దానికి పాల్పడే వారి పట్ల కటిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారి మీద పిడి అక్ట్ పెడతాము అని చెప్పి ఒక్కరి మీదా కూడా పెట్టలేదని మండిపడ్డారు. ఇందిరా పార్క్ లో మేము అనాధ లకోసం ధర్నా చేస్తే ఒక బాబు మాట్లాడుతూ దాతలు వస్తె మేము తింటున్నాం దాతలు రాని రోజు పస్తులు వుంటున్నాం అని చెప్పి ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు.. ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే…
మరి మనం దేశం కు ఆదర్శంగా వుంటున్నమా కేటీఆర్, కేసీఆర్ లు గుర్తించాలన్నారు. పేద రైతులకు రైతు బందు ఇస్తే మాకు సంతోషం అలాంటిది మంత్రి మల్లారెడ్డి లాంటి వారికి భూస్వాములకు రైతు బంధు ఇవ్వద్దు. భూస్వాములకు ఇవ్వకుండా అనాధల సంక్షేమం కోసం ఖర్చు చెయ్యాలి అని అంటున్నామని, ఈ అసెంబ్లీ సమావేశంలో అనాధ లకు ప్రత్యేక చట్టం అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం వారికి స్మార్ట్ కార్డ్ లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అనాధల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలి లేక పోతే సీఎం, కేటీఆర్ ఇలాఖాలో ధర్నాలు చేస్తామని, 15 తేదీ నుండి అనాధల హరి గోస దీక్ష పెడతామని హెచ్చరించారు.
Suspension on CI: చేర్యాల CI పై సస్పెన్షన్ వేటు.. బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే..
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!