Home
Telangana Budget
Telangana Budget News
-
Harish Rao : కాంగ్రెస్ సర్కార్ది ఎగవేతల పాలన.. రైతులకు అడుగడుగునా దగా
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ చర్చలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత బడ్జెట్ ప్రసంగంలో ప్యూరిటీ (Purity), క్లారిటీ (Clarity), షూరిటీ (Surety) ఏమీ లేవని, ఇది కేవలం అంకెల గారడీ అని ఆయన విమర్శించారు. రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం ఏ రకంగా వంచిస్తోందో హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు. మేనిఫెస్టోలో ప్రతి ఎకరానికి రూ. 15,000 ఇస్తామని చెప్పి, అధికారంలోకి… -
Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంఖ్యల చుట్టూ తిరిగే అంకెల గారడీ కాదని, ప్రతి సామాన్యుడి చుట్టూ తిరిగే మానవీయ కోణం ఉన్న ప్రణాళిక అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, గతంలో అనేక కుటుంబాలు యజమానిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉండటాన్ని తాము గమనించామని, అందుకే రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేలా భారీ ఎత్తున… -
Bhatti Vikramarka : తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో మొండిచేయి.. మేం చేసిన తప్పేంటి.? భట్టి ఫైర్..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తామంతా ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ, ఒక్క విన్నపాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణ ఏం తప్పు చేసింది?” అని ప్రశ్నిస్తూ, కేంద్రం వివక్షాపూరిత వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రీజినల్… -
Bhatti Vikramarka : ఢిల్లీ వేదికగా భట్టి గర్జన.. కేంద్రానికి షాకిచ్చే డిమాండ్లు.!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. శనివారం నాడు న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ‘ప్రి-బడ్జెట్’ సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం ముందుంచారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని,… -
TG Govt: గుడ్న్యూస్.. డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు మంజూరు..
డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మే మాసంలో 4021 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది. డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2016 మంజూరు చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయంలో కేవలం 4011 మందికి మాత్రమే డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పింఛన్ వచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఒక్క మే మాసంలోనే అంతకు మంచి పెన్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. మంత్రి సీతక్క చొరవతో నూతన లబ్ధిదారుల ఎంపిక జరిగింది. -
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు గురువారం రాత్రి నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 11 రోజులపాటు నిరంతరంగా కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక అంశాలను చర్చించి, ఆమోదం తెలిపింది. సభలో ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు సభ సమావేశమైంది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఉభయసభల్లో… -
KTR : మీరు గ్రేట్ భట్టి అన్న.. ఆర్థిక శాఖ మంత్రి కదా.. అలాగే ఉండాలి
KTR : తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని, బడ్జెట్లో రాష్ట్రానికి ప్రస్తావన కూడా లేకపోవడం బాధకరమని అన్నారు. కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రానికి వస్తున్నా, బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆక్షేపించారు. కేంద్ర మంత్రుల పర్యటనలకు ఖర్చు చేయాల్సిన అవసరం రాష్ట్రానికి లేకపోయినా, ఆ ఖర్చును తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించివుంటే మేలు జరిగేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ చేసిన “తల్లిని చంపి… -
CAG Report: అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం.. 2023-24 బడ్జెట్ పూర్తి సమాచారం..
సభలో కాగ్ నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. కాగ్ నివేదిక ప్రకారం.. 2023-24 బడ్జెట్ అంచనా రూ. 2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ. 2,19,307 కోట్లు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం లభించింది.. -
Jupally Krishna Rao : తెలంగాణ పర్యాటక అభివృద్ధిపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన
Jupally Krishna Rao : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పర్యాటక శాఖపై చర్చ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఈ ప్రభుత్వం దిశానిర్దేశంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యాలు రానున్న ఐదేళ్లలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం. మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం. దేశీయ, అంతర్జాతీయ… -
MLC Jeevan Reddy: తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం
నలభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి బడ్జెట్ రూపొందించారని..ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి రూ.7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని.. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యకరమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!