Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయని.. ఈఅరాచకం ఎక్కువ రోజులు చెల్లదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గెలుపును అడ్డుకోలేకపోయారని, అయితే ఒకానొక సమయంలో అధికార పార్టీ బలం మొత్తం ఫలించలేదని ఈటెల గతంలో చాలాసార్లు ఆరోపించారు.
Read also: Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు.. ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే…
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
హుజూరాబాద్లో శాంతియుత వాతావరణాన్ని అధికార పార్టీ నేతలు చెడగొట్టారని ఈటల ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్నారని, బీజేపీ కార్యకర్తలు తమను విచక్షణారహితంగా కొట్టారని విమర్శించారు. నిన్న తమపై దాడి జరిగితే దాడిచేసిన వారిని వదిలిపెట్టారని.. టాస్క్ఫోర్స్ పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలను తీసుకెళ్లి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలు ఎక్కువ కాలం సాగవని అధికార పార్టీ చేస్తున్న ఆగడాలు శృతిమించాయన్నారు ఈటల అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారా? టాస్క్ఫోర్స్ పోలీసులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? కొట్టడం ఏమిటి? చట్టం పని చేస్తుందా అని డీజీపీని ప్రశ్నించారు. తన మండలానికి చెందిన మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్, తుమ్మ శోభన్లను వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు.
మళ్లీ రాజకీయ వేడి…
హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఈటల రాజేందర్ను ఐటీ పురపాలక శాఖ మంత్రి ఈ నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత ఆయనకు ఆహ్వానం అందలేదు. మరోవైపు వారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ తన ప్రసంగాల్లో ఘాటుగా ప్రశ్నించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో అయినా ఈ నియోజకవర్గంలో గెలుపు సొంతం చేసుకోవాలని ఇప్పటి నుంచి దూకుడు పెంచారు స్థానిక నాయకులు. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Suspension on CI: చేర్యాల CI పై సస్పెన్షన్ వేటు.. బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!