MLC Kavitha: టికెట్ రాని అందరికీ పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఎమ్మెల్యే టికెట్ రాని వారందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ తన వ్యక్తిగత ఎజెండా కాదని అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం అంబేద్కర్ కూడా పోరాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంట్లో మహిళలు 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్సభలో 8 శాతం మహిళా ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి చేరుకుందని అన్నారు. మణిపూర్లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని అన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా మహిళలు కొనసాగాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. 2023లో కూడా ఎందుకు ఆమోదం పొందడం లేదు? 14 ఏళ్లుగా మహిళా బిల్లుకు మోదీ ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలపడం లేదని నిరసించారు.
Read also: బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వచ్చే డిసెంబర్లో మళ్లీ దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఓ ప్రొఫెసర్ ఆరోపించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళ్తుందని ఓ ఎంపీ చెప్పినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా చర్యలు తీసుకుంటామని ఆమె బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఎవరైనా మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్ రాని వారందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్కు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదన్నారు.
R. Krishnaiah: బీసీ లకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!