MLC Kavitha: టికెట్ రాని అందరికీ పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఎమ్మెల్యే టికెట్ రాని వారందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ తన వ్యక్తిగత ఎజెండా కాదని అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం అంబేద్కర్ కూడా పోరాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంట్లో మహిళలు 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్సభలో 8 శాతం మహిళా ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి చేరుకుందని అన్నారు. మణిపూర్లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని అన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా మహిళలు కొనసాగాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. 2023లో కూడా ఎందుకు ఆమోదం పొందడం లేదు? 14 ఏళ్లుగా మహిళా బిల్లుకు మోదీ ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలపడం లేదని నిరసించారు.
Read also: బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వచ్చే డిసెంబర్లో మళ్లీ దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఓ ప్రొఫెసర్ ఆరోపించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళ్తుందని ఓ ఎంపీ చెప్పినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా చర్యలు తీసుకుంటామని ఆమె బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఎవరైనా మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్ రాని వారందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్కు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదన్నారు.
R. Krishnaiah: బీసీ లకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా..
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!