CM Revanth Reddy: రాబోయే ఎన్నికల్లో మోడీని, బీజేపీని ఓడిస్తాం..
- ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ ప్రజల్లోనే ఉంది..
- మోడీ పీఎం అయ్యాక సామాజిక న్యాయంపై ఆలోచన చేయలేదు..
- రాబోయే ఎన్నికల్లో మోడీని, బీజేపీని ఓడిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: కాంగ్రెస్ న్యాయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పోరాటం చేసింది.. బ్రిటిష్ వాళ్లపై కాంగ్రెస్ పోరాడింది.. దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని ఇచ్చింది.. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ ప్రజల్లోనే ఉంది.. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంది.. మోడీ పీఎం అయ్యాక సామాజిక న్యాయంపై ఆలోచన చేయడం లేదని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం.. పాకిస్తాన్ విషయంలో ఇందిరా గాంధీ వార్ చేసి.. ఖాళీ మాతగా నిలిచారు.. మహాత్మగాంధీ త్యాగం చేసి దేశాన్ని కాపాడారు.. ఇందిరా, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను అర్పించారు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
ఇక, బీజేపీ, మోడీలను ఓడించడానికి మేం తక్కువ కాదు.. రానున్న ఎన్నికల్లో మోడీ, బీజేపీని ఓడిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియాను ప్రధాని చేయాలని అందరూ కోరినా.. మన్మోహన్ సింగ్ కు అవకాశం ఇచ్చారు.. రాష్ట్రపతి అవకాశం వచ్చినా ప్రణబ్ ముఖర్జీకి ఛాన్స్ ఇచ్చారు.. త్యాగాలకు మారు పేరు గాంధీ కుటుంబం.. ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు రాహుల్ గాంధీ తీసుకోలేదు.. దేశంలో ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడుతున్నారు.. 2001 నుంచి మోడీ కుర్చీ వదలడం లేదు.. 75 ఏళ్లు నిండిన వాళ్ళు కుర్చీ వీడాలని మోహన్ భగవత్ అన్నారు.. కానీ, మోడీ మాత్రం వదలడం లేదని సెటైర్లు వేశారు. ఆర్ఎస్ఎస్ మోడీని తప్పించక పోతే.. రానున్న ఎన్నికల్లో మోడీని రాహుల్ ప్రధాని కుర్చీ నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 స్థానాలకు మించి రావని విమర్శించారు. ఇక, తెలంగాణలో కులగణన చేసి.. దేశానికి రోల్ మోడల్ గా నిలిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!