Telangana Rains: గోదావరిలో పెరిగిన వరద.. ప్రమాద హెచ్చరిక జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Level Rising In Bhadrachalam Godavari: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరోసారి విస్తారంగా కురుస్తుండటం వల్ల.. భద్రాచలం గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే గోదావరి వరద 43 అడుగుల చేరడంతో.. జిల్లా కలెక్టర్ అనుదీప్ తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరికి ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి, నదుల నుండి వరద వస్తున్న నేపథ్యంలో.. మంగళవారం రాత్రికి గోదావరి వరద 55 అడుగులకు పెరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి.. ముంపు మండలాల ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. పశువులను బయటకు మేతకు వడలకుండా, ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంచాలన్నారు. అలాగే.. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పారు. ప్రస్తుతం గోదావరిలో 9.55 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొసాగుతోంది.
కాగా.. గత నెలలో భద్రాచలం వద్ద గోదావరికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం విదితమే! 70 అడుగుల మేర గోదావరి ప్రవహించడంతో.. భద్రాచలంలోని కాలనీలు నీటమునిగాయి. ముంపు గ్రామాలైతే వారం పాటు నీటిలోనే ఉండిపోయాయి. ఇప్పుడు మరోసారి గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆల్రెడీ మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలో వాన దంచికొట్టింది. శేరిలింగంపల్లి, షేక్పేట్, ఆసిఫ్నగర్ ఏరియాల్లో అత్యధికంగా 4.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. నిజామాబాద్లోని డిచ్పల్లిలో అత్యధికంగా 27 మి.మీ. నమోదైనట్లు తేలింది.
Also Read
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!