Warangal: భద్రకాళి చెరువు ఖాళీ చేసేందుకు సర్వం సిద్ధం.. అడ్డుకున్న మత్స్యకారులు..
- వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు పూడికతీత పనులను అడ్డుకున్న స్థానిక మత్స్యకారులు..
- ఉపాధి చూపించాకే చెరువులోని నీటిని తీయాలని మత్స్యకారులు ఆందోళన..
Warangal: వరంగల్ జిల్లా ఈరోజు భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టనున్నారు. భద్రకాళి చెరువు ప్రక్షాళనలో భాగంగా చెరువులోని నీరంతా దిగువకు వదిలేసి అందులో పూడికతీత, గుర్రపుడెక్క తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. నీటిని దిగువకు వదలడం, పూడికతీత పనులపై ఇప్పటికే ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారుల సమన్వయ సమావేశమైన విషయం తెలిసిందు. ప్రస్తుతం భద్రకాళి చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పూర్తి నీటి సామర్థ్యం 150 ఎంసీఎఫ్టీ లు.. ప్రస్తుతం 100 ఎంసీఎఫ్టీ నీరు నిల్వ ఉంది. ఇక రోజుకు 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు అధికారులు.
Read also: Sarpanch Oath Ceremony: కొత్తగా ఎన్నికైన 10 వేల మంది సర్పంచ్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్న సీఎం
Also Read
- Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..
- RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
- Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
- Warangal: భార్యను కొడుతుండగా అడ్డువెళ్లిన తండ్రి.. కట్ చేస్తే..?
దిగువన కాలనీలు ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టారు. 15 రోజులపాటు నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొండ సురేఖ ఆదేశాలు మేరకు భద్రకాళి చెరువును ఖాళీ చేయనున్నారు అధికారులు. చెరువు ఖాళీ చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. హనుమకొండ కాపు వాడ మత్తడి ద్వారా ప్రతిరోజు 300 నుండి 500 క్యూసిక్కుల నీళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు దిగువకు వదలనున్నారు. కాపు వాడ మత్తడి నుంచి అలంకార్ పెద్ద మోరీ, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ, మీదుగా నాగారం చెరువులోకి నీళ్లను వదలనున్నారు. సుమారు 15 నుండి 20 రోజుల్లో చెరువు ఖాళీ చేయనున్నారు. పూడిక తీసిన అనంతరం నీళ్లు నింపడానికి కాకతీయ కాలువ ద్వారా ప్రణాళిక సిద్ధం చేశారు.
Read also: Hardeep Singh Puri: మనం రష్యా నుంచి చమురు కొనకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది..
అయితే మరోవైపు *భద్రకాళి చెరువు పూడికతీత పనులను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే చెరువులోని నీటిని తీయాలని ఆందోళన చేపట్టారు. భద్రకాళి సొసైటీలో సుమారు 450 మంది సభ్యులు ఉన్నారు. సుమారు రెండు కోట్ల విలువచేసే చేపలు ఉన్నాయంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధి చూపించే వరకు పూడిక తీత అడ్డుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
MLA Gaddam Vinod: బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్కు భద్రత పెంపు.. ప్రభాత్ హెచ్చరిక లేఖతో అలర్ట్..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో