Warangal: భద్రకాళి చెరువు ఖాళీ చేసేందుకు సర్వం సిద్ధం.. అడ్డుకున్న మత్స్యకారులు..
- వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు పూడికతీత పనులను అడ్డుకున్న స్థానిక మత్స్యకారులు..
- ఉపాధి చూపించాకే చెరువులోని నీటిని తీయాలని మత్స్యకారులు ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ జిల్లా ఈరోజు భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టనున్నారు. భద్రకాళి చెరువు ప్రక్షాళనలో భాగంగా చెరువులోని నీరంతా దిగువకు వదిలేసి అందులో పూడికతీత, గుర్రపుడెక్క తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. నీటిని దిగువకు వదలడం, పూడికతీత పనులపై ఇప్పటికే ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారుల సమన్వయ సమావేశమైన విషయం తెలిసిందు. ప్రస్తుతం భద్రకాళి చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పూర్తి నీటి సామర్థ్యం 150 ఎంసీఎఫ్టీ లు.. ప్రస్తుతం 100 ఎంసీఎఫ్టీ నీరు నిల్వ ఉంది. ఇక రోజుకు 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు అధికారులు.
Read also: Sarpanch Oath Ceremony: కొత్తగా ఎన్నికైన 10 వేల మంది సర్పంచ్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్న సీఎం
Also Read
- Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..
- RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
- Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
- Warangal: భార్యను కొడుతుండగా అడ్డువెళ్లిన తండ్రి.. కట్ చేస్తే..?
దిగువన కాలనీలు ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టారు. 15 రోజులపాటు నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొండ సురేఖ ఆదేశాలు మేరకు భద్రకాళి చెరువును ఖాళీ చేయనున్నారు అధికారులు. చెరువు ఖాళీ చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. హనుమకొండ కాపు వాడ మత్తడి ద్వారా ప్రతిరోజు 300 నుండి 500 క్యూసిక్కుల నీళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు దిగువకు వదలనున్నారు. కాపు వాడ మత్తడి నుంచి అలంకార్ పెద్ద మోరీ, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ, మీదుగా నాగారం చెరువులోకి నీళ్లను వదలనున్నారు. సుమారు 15 నుండి 20 రోజుల్లో చెరువు ఖాళీ చేయనున్నారు. పూడిక తీసిన అనంతరం నీళ్లు నింపడానికి కాకతీయ కాలువ ద్వారా ప్రణాళిక సిద్ధం చేశారు.
Read also: Hardeep Singh Puri: మనం రష్యా నుంచి చమురు కొనకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది..
అయితే మరోవైపు *భద్రకాళి చెరువు పూడికతీత పనులను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే చెరువులోని నీటిని తీయాలని ఆందోళన చేపట్టారు. భద్రకాళి సొసైటీలో సుమారు 450 మంది సభ్యులు ఉన్నారు. సుమారు రెండు కోట్ల విలువచేసే చేపలు ఉన్నాయంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధి చూపించే వరకు పూడిక తీత అడ్డుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
MLA Gaddam Vinod: బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్కు భద్రత పెంపు.. ప్రభాత్ హెచ్చరిక లేఖతో అలర్ట్..
తాజావార్తలు
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!