MGM : వరంగల్ డెడ్బాడీ కలకలం.. అంబులెన్స్లో డెడ్బాడీ తీసుకొచ్చారు.. తీరా చూస్తే మరెవరదో
- అసలు భర్త మృతదేహం ఎక్కడ?.. భార్య ఆవేదన
- మార్చురీ సిబ్బందిపై నిర్లక్ష్య ఆరోపణలు
- ఒక్కరోజులో నాలుగు పోస్టుమార్టాలు.. మృతదేహం మారిపోయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డెడ్ బాడీ మారిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరికి బదులుగా మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి (50) మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఆసుపత్రి అధికారులు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని భార్యకు అప్పగించారు.
CM Chandrababu: మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చిన సీఎం.. ఆనందానికి అవదులు లేవు అంతే..!
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
కుమారస్వామి భార్య, మృతదేహాన్ని తన పుట్టింటి గ్రామమైన రాయపర్తి మండలం మైలారం తీసుకెళ్లింది. అంబులెన్స్ ఊరి చివరికి చేరుకున్న తర్వాత, శవాన్ని చూడగానే ఆమె అది తన భర్తది కాదని గుర్తించింది. వెంటనే ఆమె స్పందించి మృతదేహాన్ని తిరిగి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మా భర్త మృతదేహం ఎవరు తీసుకెళ్లారు?”, “ఇప్పుడున్న మృతదేహం ఎవరిది?” అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదంతా మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
ఎంజీఎం వైద్యులు మాత్రం.. “కుటుంబ సభ్యులే మృతునిని గుర్తించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము పోస్టుమార్టం చేసి శవాన్ని అప్పగించాం” అని వివరణ ఇచ్చారు. ఈరోజు మార్చురీలో మొత్తం నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారని తెలుస్తోంది. దీనిలో డెడ్ బాడీ మారిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి నిజానిజాలు వెలుగులోకి రావాలంటే మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!