Konda Surekha: ఆయన నల్లికుట్ల మనిషి.. నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
- కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి..
- నాపై సీఎం, పొంగులేటి వద్దకు వెళ్లి లేనిది ఉన్నది చెబుతున్నారు..
- నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీలవుతున్నారు..
- నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు: మంత్రి కొండా సురేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: ఉమ్మడి వరంగల్లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్చాట్ లో చేస్తూ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని ఆరోపించింది. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని పేర్కొనింది. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు అని తెలిపింది. ముఖ్యమంత్రి దగ్గరకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు అని చెప్పుకొచ్చింది. తెలుగు దేశం పార్టీలో నడిపించుకున్నట్లు.. ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించింది.
Read Also: iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!
Also Read
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
అయితే, నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను.. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడని కొండా సురేఖ తెలిపింది. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా అని ప్రశ్నించింది. నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు.. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది.. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా అని అడిగింది. అలాగే, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఆమె తీవ్రంగా మండిపడింది. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు.. కొందరు తమ సొత్తు అన్నట్లు ఫీల్ అవుతున్నారు.. నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరికాదు.. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. ఆగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అమ్మవారు శాఖాహారి అని అందరికీ తెలుసు.. అక్కడ ఏళ్లుగా పని చేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం.. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
-
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్పై మాజీమంత్రి అంబటి ఫైర్
-
CM Revanth Reddy: రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
-
Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
-
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!