Rajaiah Vs Kadiyam Srihari: రాజయ్య వర్సెస్ శ్రీహరి… మాటల పంచాయతీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇద్దరు దళిత నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్టేషన్గన్పూర్ నియోజకవర్గం లో ఇద్దరు దళిత నాయకుల మధ్య దళిత బంధు పంచాయతీ కొనసాగుతుంది.. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎం దళిత బంధు విషయంలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడంతో దళిత వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘనపూర్ లో CMRF చెక్కుల పంపిణీ సందర్భంగా దళిత బంధులో బంధుప్రీతి పెరిగిందని సరైన అర్హులకు దళిత బంధు అందడం లేదంటూ కడియం చేసిన కామెంట్ .. ఎమ్మెల్యే రాజయ్య గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.. రెండు రోజుకుగా కడియం శ్రీహరి పైనా పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు.
సోమవారం చేపల పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దళిత నేతగా గుర్తింపు పొందిన నేను దళితులకు ఎప్పుడు అన్యాయం చేయాలేదన్నారు. అర్హులకే దళిత బంధు అందించాం.విడతల వారిగా అందరికి దళిత బంధు వస్తుంది అని హామీ ఇచ్చిన రాజయ్య మంగళవారం సైతం దాన్ని కొనసాగింపుగా కడియం శ్రీహరికు పరోక్ష చురకలు అంటించారు.. స్టేషన్ ఘనపూర్ లో మొదటి విడత ఇచ్చిన దళిత బంధులో ఎవ్వరు అనర్హులో చెప్పాలి అని సవాల్ విసిరారు. అదే సమయంలో మా బంధువులకు . మా అనుచరులు దళిత బంధు తీసుకోరు అని చెప్పగలరా అని పరోక్షంగా చురకలు అంటించారు. దళిత జాతిలో పుట్టిన ఆ నేత మా వర్గాల వారికి దళిత బంధు అవసరం లేదని చెప్పగలరా? మా బంధువులకు దళిత బంధు ఇవ్వాల్సిన పనిలేదని మాటిస్తారా? అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో స్టేషన్గన్పూర్లో ఇద్దరి నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో దళిత వర్గాలు నలిగిపోతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మరో సారి కడియం శ్రీహరి పైన పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దళిత బంధు పంపిణి జరుగుతున్న పారదర్శకత పార్టీ లోని సభ్యుల గుర్తించకపోతే ఎలా? అన్నారు. రాజయ్య నువ్వు స్థానికుడివి రాజకీయలలోకి రావాలి అని అంటే రాజకీయాల్లోకి వచ్చా. కొందరు నేనొస్తా నేనొస్తా అని వస్తున్నారు. ప్రజాదరణ లేకపోతే ఏమైవుతుంది? కేసీఆర్ కి నేను వీర విధేయుడిని. కేసీఆర్ విధేయతలో ఎవరితో అయిన నేను పోటీకి సిద్ధం అన్నారు రాజయ్య. స్టేషన్ ఘనపూర్ లో మొదటి విడత దళిత బంధు ఇచ్చిన వంద మందిలో ఎవరు అర్హులు కాదో చెప్పాలని సవాల్ చేశారు.
Read Also: Vasireddy Padma: మహిళలకు ప్రేమించే హక్కు, నిరాకరించే హక్కు రెండూ ఉంటాయి
కొన్ని రాజకీయ కారణాల తో పదవి తీసేసిన కేసిఆర్ కు విధేయుడి గానే ఉన్నా.. ఉంటానన్నారు. తపస్సు చేసే ఋషులు ఓం నమశివాయ అంటే.. నేను మాత్రం ఓం కేసీఆర్ అనే మంత్రాన్నే వల్లెవేస్తానన్నారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలు స్థానిక నాయకత్వం కోరుకుంటున్నారు అది మీరు అనుభవిస్తున్నారు. తాటాకు చప్పుళ్ళకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు రాజయ్య.
తాజావార్తలు
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..