YS Viveka Case: ఎర్ర గంగిరెడ్డికి షాక్.. హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Case: వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గంగిరెడ్డిని జూలై 1న జైలు నుంచి విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ను హైకోర్టు గత నెల 27న రద్దు చేసింది. జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు.. జూలై 1న విడుదల చేయాలని ఆదేశించింది.దీంతో వివేకా కుమార్తె సునీత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు గంగిరెడ్డిని జూలై 1న విడుదల చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ షరతులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ, కస్టడీ అనంతరం విడుదల తేదీ ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు న్యాయశాస్త్రంలో ఎనిమిదో విచిత్రమని సీబీఐ న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గంగిరెడ్డి బెయిల్ దుర్వినియోగం చేసి సాక్షులను బెదిరించిన సందర్భాలు ఉన్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. హత్యలకు పాల్పడిన నిందితులు బయటపడితే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Read also: Birthday Reminder: లవర్ బర్త్ డే మర్చిపోయారా.. అయితే ఇలా చేయండి
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
ఈమేరకు ఎర్ర గంగిరెడ్డి బెయిల్పై వైఎస్ సునాథారెడ్డి ఈ నెల 16న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ను సునీతారెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని 2019 మార్చి 14న ఆయన నివాసంలో హత్య చేశారు.ఈ హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి 1వ నిందితుడు. వివేకానంద రెడ్డి హత్య కేసును అప్పట్లో సిట్ విచారించింది. కానీ సకాలంలో చార్జిషీటు దాఖలు కాలేదు. దీంతో ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. తదుపరి పరిణామాలతో వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారించనుంది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారించనుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ రద్దు చేయాలని ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసింది. జూలై 1న విడుదల కావాల్సి ఉన్నందున సునీత కోర్టుకు వెళ్లి డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసుకుంది.
Ashada bonalu: గోల్కొండలో ఆషాడ బోనాలు.. ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..