YS Viveka Case: ఎర్ర గంగిరెడ్డికి షాక్.. హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Case: వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గంగిరెడ్డిని జూలై 1న జైలు నుంచి విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ను హైకోర్టు గత నెల 27న రద్దు చేసింది. జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు.. జూలై 1న విడుదల చేయాలని ఆదేశించింది.దీంతో వివేకా కుమార్తె సునీత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు గంగిరెడ్డిని జూలై 1న విడుదల చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ షరతులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ, కస్టడీ అనంతరం విడుదల తేదీ ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు న్యాయశాస్త్రంలో ఎనిమిదో విచిత్రమని సీబీఐ న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గంగిరెడ్డి బెయిల్ దుర్వినియోగం చేసి సాక్షులను బెదిరించిన సందర్భాలు ఉన్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. హత్యలకు పాల్పడిన నిందితులు బయటపడితే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Read also: Birthday Reminder: లవర్ బర్త్ డే మర్చిపోయారా.. అయితే ఇలా చేయండి
Also Read
- OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ... బీఆర్ఎస్ భారీ స్కెచ్?
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
ఈమేరకు ఎర్ర గంగిరెడ్డి బెయిల్పై వైఎస్ సునాథారెడ్డి ఈ నెల 16న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ను సునీతారెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని 2019 మార్చి 14న ఆయన నివాసంలో హత్య చేశారు.ఈ హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి 1వ నిందితుడు. వివేకానంద రెడ్డి హత్య కేసును అప్పట్లో సిట్ విచారించింది. కానీ సకాలంలో చార్జిషీటు దాఖలు కాలేదు. దీంతో ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. తదుపరి పరిణామాలతో వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారించనుంది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారించనుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ రద్దు చేయాలని ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసింది. జూలై 1న విడుదల కావాల్సి ఉన్నందున సునీత కోర్టుకు వెళ్లి డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసుకుంది.
Ashada bonalu: గోల్కొండలో ఆషాడ బోనాలు.. ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?