Lakefront Park: చారిత్రక హుస్సేన్సాగర్ రిజర్వాయర్ ఒడ్డున హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్క్ ఆదివారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు రూ.26.65 కోట్లతో కొత్త థీమ్లతో రూపొందించిన లేక్ఫ్రంట్ పార్కును గత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఆ తర్వాత గణేష్ నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న పార్కులన్నీ మూసివేసి సందర్శకులను అనుమతించలేదు. ప్రస్తుతం నిమజ్జనాలు ముగియడంతో ఆదివారం నుంచి కొత్తగా నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్కులోకి సందర్శకులను అనుమతిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. లేక్ ఫ్రంట్ పార్క్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు వాకర్లకు సమయం కేటాయించాలని నిర్ణయించారు.
నగరవాసులు నెలకు రూ.100 చెల్లించి మార్నింగ్ వాక్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. అదేవిధంగా లేక్ ఫ్రంట్ పార్కులో 100 మందికి మించకుండా పుట్టినరోజు వేడుకలు, గెట్ టు గెదర్ ఫంక్షన్లు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వారికి రూ.11 వేలు చెల్లించి హెచ్ ఎండీఏ ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ కరాచీ బేకరీ అవుట్లెట్తోపాటు ఇతర అవుట్లెట్లు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ ఫంక్షన్స్ కి వంద మందికి మించకుండా చేసుకునే సదుపాయాన్ని కూడా హెచ్ఎండీఏ ఈ పార్కులో అవకాశం ఇచ్చింది. పర్యాటకుల కోసం ఈ లేక్ ఫ్రంట్ పార్క్లో కరాచీ బేకరీ అవుట్ లెట్తో పాటు మరికొన్ని అవుట్ లెట్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పార్క్ అందుబాటులోకి రావడంతో జల్ విహార్, PVNR మార్గ్ సమీపంలోని ఈ లేక్ ఫ్రంట్ పార్క్ సాధారణ ప్రజలకు కేంద్రంగా నిలవనుంది.
Modi Posters: ఇటు హైదరాబాద్ లో.. అటు నిజామాబాద్ లో మోడీ పోస్టర్లు కలకలం