Vikarabad: ఆ మండలాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్.. పోలీసులు భారీ బందోబస్తు..
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన..
- దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు..
- పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పలువురు జిల్లాకు రానున్న నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని మండలాలకు అనుమతించడం లేదు. మరోవైపు కలెక్టర్ పై దాడికి జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఒక వైపు నిరసన, మరోవైపు పలు నాయకులు మండలాలకు రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Read also: Dowry Harassment: విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. వాహనాలను తనికీలు చేసి అనుమతిస్తున్నారు. లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిలో సురేశ్ కీలకంగా ఉన్నట్లు సమాచారం. రాజకీయ కోణంలోనూ విచారణ జరుపుతున్నామని, విచారణలో అన్నీ తెలుస్తాయని చెప్పారు. అర్ధరాత్రి నుంచి పోలీసు బలగాలు భారీ ఎత్తున లగాచర్లను చుట్టుముట్టాయి. విద్యుత్ను నిలిపివేసి ప్రతి ఇంటిని దిగ్బంధించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరినీ అనుమతించడం లేదు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే..
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!