Vikarabad: ఆ మండలాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్.. పోలీసులు భారీ బందోబస్తు..
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన..
- దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు..
- పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు..
Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పలువురు జిల్లాకు రానున్న నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని మండలాలకు అనుమతించడం లేదు. మరోవైపు కలెక్టర్ పై దాడికి జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఒక వైపు నిరసన, మరోవైపు పలు నాయకులు మండలాలకు రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Read also: Dowry Harassment: విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి
Also Read
వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. వాహనాలను తనికీలు చేసి అనుమతిస్తున్నారు. లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిలో సురేశ్ కీలకంగా ఉన్నట్లు సమాచారం. రాజకీయ కోణంలోనూ విచారణ జరుపుతున్నామని, విచారణలో అన్నీ తెలుస్తాయని చెప్పారు. అర్ధరాత్రి నుంచి పోలీసు బలగాలు భారీ ఎత్తున లగాచర్లను చుట్టుముట్టాయి. విద్యుత్ను నిలిపివేసి ప్రతి ఇంటిని దిగ్బంధించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరినీ అనుమతించడం లేదు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే..
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో