Vikarabad: ఆ మండలాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్.. పోలీసులు భారీ బందోబస్తు..
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన..
- దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు..
- పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పలువురు జిల్లాకు రానున్న నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని మండలాలకు అనుమతించడం లేదు. మరోవైపు కలెక్టర్ పై దాడికి జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఒక వైపు నిరసన, మరోవైపు పలు నాయకులు మండలాలకు రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Read also: Dowry Harassment: విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. వాహనాలను తనికీలు చేసి అనుమతిస్తున్నారు. లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిలో సురేశ్ కీలకంగా ఉన్నట్లు సమాచారం. రాజకీయ కోణంలోనూ విచారణ జరుపుతున్నామని, విచారణలో అన్నీ తెలుస్తాయని చెప్పారు. అర్ధరాత్రి నుంచి పోలీసు బలగాలు భారీ ఎత్తున లగాచర్లను చుట్టుముట్టాయి. విద్యుత్ను నిలిపివేసి ప్రతి ఇంటిని దిగ్బంధించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరినీ అనుమతించడం లేదు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే..
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!