CM Revanth: కోస్గి సభలో సీఎం కీలక ప్రకటన.. వారం రోజుల్లో ఆ పథకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్లో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబందు అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
CM Revanth: మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్..
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
‘కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్ను గెలిపిస్తే ఇక్కడి ప్రజలను మోసగించారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ జిల్లాలో ఓట్లు అడగాలన్నారు. 27 వేల కోట్లు ఖర్చు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వని దద్దమ్మ కేసీఆర్ అని మండిపడ్డారు. చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో చేరి.. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఛీ కొట్టిన సిగ్గు రాలేదని.. మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు.
పాలమూరులో ఏ ప్రాజెక్టు పూర్తి చేశావని మళ్లీ ఇక్కడకు వస్తానంటున్నావని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏ ప్రాజెక్ట్ ను పూర్తి చేశావని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయమే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. రోజమ్మ పిలిచి రాగి సంకటి, నాటుకోడి పులుసు పెట్టగానే పులుసు తిని అలుసు ఇచ్చి బలిచిపోయి రాయలసీమకు నీళ్లు ఇస్తా అన్నావని కేసీఆర్ పై విమర్శలు చేశారు.
Ex-Boyfriend: ఈ మాజీ లవర్ ఎంత అదృష్టవంతుడో.. 2 కోట్ల గిఫ్ట్తో సర్ఫ్రైజ్!
పాలమూరు అభివృద్ధి ముసుగులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2014లో ప్రధాని మోదీ జాతీయహోదా ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో జిల్లా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ జిల్లాలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్లో 50 వేల మెజార్టీ ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 14 లోక్ సభ సీట్లు గెలిస్తేనే.. దేశ స్థాయిలో రాష్ట్రం యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుందన్నారు. అందుకోసమని.. కార్యకర్తలు ఆ దిశగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!