Vemula Prashanth Reddy: మోడీ, అమిత్ షా.. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy Sensational Comments On Narendra Modi: ఈ ప్రపంచంలో అత్యంత అవినీతిపరులైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే.. అది ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వేత్తలకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకుల రుణమాఫీ చేసిన నీచమైన ఘనత మోడీదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసీలను కూడా ప్రైవేటుపరం చేయాలని దగుల్బాజి బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో.. నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు చొప్పున పే ప్రజల ఖాతాలోకి వేస్తానని మోడీ చెప్పారని, ఏ ఒక్క పేదోడి ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదని చెప్పారు. ఒక్క పని కూడా చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ ఒక చేతకాని దద్దమ్మ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు.
కాగా.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన రోడ్డు భవనాల అతిథి గృహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతో, రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఆర్ & బీ ప్రతిపాదనల్లో 4 మాత్రమే మంజూరు చేశామన్నారు. అందులో పెద్దపల్లికి చోటు దక్కిందని తెలిపారు. ఆర్ & బీ శాఖ ద్వారా మొత్తం 1,458 కోట్ల పనులు మంజూరు చేసుకున్నామని, రూ.680 కోట్ల ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేశామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు, సాగు నీటి ప్రాజెక్టుల ఫలితంగానే.. పెద్దపల్లి జిల్లాలో వరి సాగు పెరిగిందన్నారు. 2014లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో 98 వేల ఎకరాల్లో వరి సాగు జరిగితే.. ఇప్పుడు 1.58 వేల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. నిబద్దతతో పనిచేయడం వల్లే.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడిస్తోంది.
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
తాజావార్తలు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!