Uttarakhand: ఉత్తరాఖండ్లో పేలిన ట్రాన్స్ఫార్మర్.. 16 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని నమామి గంగే ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ సైట్లోని ట్రాన్స్ఫార్మర్లో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు. గంగా నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు 36 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తున్నారు. గత ఏడాది జూన్లో.. గంగా నది పునరుద్ధరణ కోసం 36 మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్లో ఆమోదించింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) ప్రకారం.. దాని ఫ్లాగ్షిప్ ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ ద్వారా, రాష్ట్రంలోని ప్రతి గంగా నదికి స్వచ్ఛమైన నీరు వచ్చేలా కేంద్రం బహుముఖ ప్రయత్నం ద్వారా మిషన్ మోడ్లో పనిచేస్తోంది.
Bro Ticket Rates: మొత్తానికి భలే సెట్ చేశారు ‘బ్రో’
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. కరెంట్ షాక్ తో ఓ వాచ్మెన్ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు సిబ్బంది స్పాట్ ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళారు. ఆ సమయంలో ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులతో సహా దాదాపు 16 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా.. రైలింగ్లో కరెంట్ ఉందని ప్రాథమికంగా వెల్లడైంది. దర్యాప్తు తరువాత మిగతా వివరాలు తెలుస్తాయి అని ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
Viral Video: ఢిల్లీ మెట్రోలో యువతి విన్యాసాలు..దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..
మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ముఖ్యమంత్రి చెప్పారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్కు తరలిస్తున్నామని, మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇంధన కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!