Uttam Kumar Reddy: బీఆర్ఎస్ బస్సు ఘటన.. షెడ్డుకు పోవాల్సందే అన్న ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో బస్సు ప్రమాదం సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు వెళుతున్న బస్సు టైరు పగలడంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును పక్కకు ఆపడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే బస్సు ఘటనపై నీటిపారుదల, పౌరసరఫరాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలిందని చూశా అన్నారు. ఇక కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయని సెటైర్ వేశారు. కారు ఇక షెడ్డుకు పోవాల్సిందే అని అన్నారు.
ఎన్టీఎస్ఏ నిపుణుల కమిటీ వేయాలని మేము కోరామన్నారు. కమిటీ వేయడం స్వాగతిస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు బ్యారేజీ లు సందర్శించి త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం.. స్టర్క్చర్ లేదు కాబట్టి ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇవ్వలేదని అన్నారు. క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదన్నారు. ఇప్పుడు చేసినవి పంపినాము అని, గత ప్రభుత్వ పని తీరు అలా ఉంది మరి మేము ఏం చేయాలని చురకలంటించారు. థర్డ్ పార్టీ రిపోర్ట్ లేనే లేదన్నారు. కంప్లైషన్ రిపోర్ట్ ఒకటి కాదు..రెండు మూడు రిపోర్ట్ లు ఇచ్చాయన్నారు. దీనిపై విజిలెన్స్ నివేదిక ఇచ్చిందన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని చట్టప్రకారం కేసులు పెడతామన్నారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
Read also: BRS Chalo Medigadda: బీఆర్ఎస్ నేతలకు తప్పిన ప్రమాదం.. పేలిన బస్సు టైర్
ఎన్డీఎస్ఏకి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఎన్డీఎస్ఏని విచారణ చేయండని కోరిందే మేము అని గుర్తుచేశారు. మేడిగడ్డ దగ్గర కి బ్యారేజి తరలించేందుకి తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ అని కేసీఆర్ చెప్పారని అన్నారు. CWC చెప్పిందని కేసీఆర్ అబద్ధం చెప్పారని కేంద్రం చెప్తుందన్నారు. CWC ఎప్పుడు అలా చెప్పలేదని వెదిర శ్రీరామ్ స్పష్టం చేశారన్నారు. CWc అనుమతి ఇవ్వలేదు.. ఇన్వెస్ట్మెంట్ అనుమతి ఇవ్వలేదని కేంద్ర అధికారులు అంటున్నారని తెలిపారు. ఏం అనుమతి ఇవ్వనిది కేంద్ర ప్రభుత్వ సంస్థలు లక్ష కోట్ల అప్పులు ఎలా ఇచ్చాయి? అని ప్రశ్నించారు. కేంద్రం కూడా తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా.. మేము చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ విధ్వంసం చేసిందన్నారు. కేటీఆర్ కంటే..ఎన్డీఎస్ఏ కి ఎక్కువ నాలెడ్జి ఉందని, అందుకే ఎన్డీఎస్ఏ నివేదిక కోరామన్నారు. కేటీఆర్ కి ఎక్కువ అనుభవం ఉందా.. ఎన్డీఎస్ఏ వాళ్లకు ఎక్కువ నాలెడ్జి ఉందా? అని ప్రశ్నించారు. చేసిన దొంగతనం గురించి చెప్పకుండా.. ఎదుటివారిని దొంగ అంటున్నారు కేటీఆర్ అని మండిపడ్డారు.
MLA Lasyana Nditha: లాస్య నందిత కేసులో ట్విస్ట్.. టిప్పర్ లారీ డ్రైవర్ అరెస్ట్
- Tags
- BRS
- BRS KTR
- kcr
- ktr
- telangana Congress
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!