MLA Lasya Nanditha: లాస్య నందిత కేసులో ట్విస్ట్.. టిప్పర్ లారీ డ్రైవర్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Lasyana Nditha: టిప్పర్ లారీని వెనకనుండి ఢీ కొట్టడంతోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిందని పోలీసులు గుర్తించారు. లాస్య నందిత ఢీ కొట్టిన టిప్పర్ లారీని పోలీసులు గుర్తించారు. ORR పైకి ఎంట్రీ అయినా సమయంలో ముందు వెళ్తున్న లారీల సీసీ కెమెరాలను పటాన్ చెరువు పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న టిప్పర్ లారీని ఎమ్మెల్యే లాస్య నందిత కారు బలంగా ఢీ కొట్టింది. లారీని ఢీ కొట్టిన తర్వాత 100 మీటర్ల దూరం వెళ్లి ORR సైడ్ రేలింగ్ ని ఢీ కొట్టిన కారు అక్కడే ఆగిపోయింది. వెనక నుండి లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ ఎమ్మెల్యే లాస్య నందిత కూర్చోవడంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో లాస్య అక్కడికక్కడే మృతి చెందారు. డైవింగ్ చేస్తున్న ఆకాష్ కొన ఊపిరితో ప్రమాదం నుంచి బయట పడ్డారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు లాస్య ప్రమాదం పై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం కూడా లాస్య ప్రమాదం పై వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆధారాలు సేకరించారు. లాస్య ఆరోజు ఎక్కడికి వెళ్లింది? తిరుగు ప్రయాణంలో ఎవరెవరు ఉన్నారు? లారీని ఢీ కొట్టడం పై ఉన్న అనుమానాలు పై ఆరా తీశారు. అయితే టిప్పర్ లారీని గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
Read also: Paytm : పేటీఎం కీలక నిర్ణయం.. పేమెంట్స్ బ్యాంక్ తో సంబంధాలకు చెక్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి.. డివైడర్ను ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. లాస్య నందిత వయసు 33. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే మృతి పట్ల తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత. 2023 ఫిబ్రవరిలో సాయన్న మరణించడంతో.. ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత పోటీ చేశారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేసినా.. నందితపై మాజీ సీఎం కేసీఆర్ నమ్మకం ఉంచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.
National Drinking Water Survey : 485 నగరాల్లో 46 నగరాల ప్రజలు మాత్రమే స్వచ్ఛమైన నీరు తాగుతున్నారట
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!