Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uttam Kumar Reddy Slams Kcr On Palamuru Rangareddy Project

Uttam Kumar Reddy : కేసీఆర్‌ కరెక్ట్‌గా ప్రిపేరై రండి, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారు

Published Date :December 21, 2025 , 10:16 pm
By Gogikar Sai Krishna
  • పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాం
  • ఇప్పుడు చెప్పండి ఎవరు మోసం చేశారో..?
  • కేసీఆర్‌ కరెక్ట్‌గా ప్రిపేరై రండి, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారు
  • కృష్ణా బేసిన్‌లో కేసీఆర్‌ చేసింది దగా, మోసం. -మంత్రి ఉత్తమ్‌
Uttam Kumar Reddy : కేసీఆర్‌ కరెక్ట్‌గా ప్రిపేరై రండి, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttam Kumar Reddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని పదేళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ విమర్శలకు మంత్రి లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తన హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ విమర్శించారు. దానికి తోడు కేసీఆర్ నిర్మించిన మూడు బ్యారేజీలు కూలిపోయాయని, ఇది ఆయన వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. “ఆనాడు ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్.. నేడు మూడు బ్యారేజీలు కూలిపోతే దానికి సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. 96,108 కోట్ల రూపాయలను 11 శాతం వడ్డీకి అప్పు తెచ్చి తెలంగాణ ప్రజలపై తీరని భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో నల్గొండ, మహబూబ్ నగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారం దిగే మూడేళ్ల ముందు నుండి ఈ ప్రాజెక్టులపై ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పనులు మొదలుపెట్టామని వెల్లడించారు. ఇప్పటికే సుమారు 7 వేల కోట్లు పాలమూరు-రంగారెడ్డి కోసం ఖర్చు పెట్టామని, త్వరలోనే వీటిని పూర్తి చేస్తామని నల్గొండ బిడ్డగా మాట ఇస్తున్నానని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. “ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్లు 720 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తే, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అది 1442 టీఎంసీలకు పెరిగింది. ఇది తెలంగాణకు చేసిన ద్రోహం కాదా?” అని ప్రశ్నించారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్విచ్ ఆన్ చేయడానికి సహకరించింది కేసీఆరేనని, అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేసి ఏపీకి మేలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెచ్చిన 88 వేల కోట్ల భారీ అప్పులను తీర్చే పని ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి వివరించారు. కేసీఆర్ 11 శాతం వడ్డీకి లోన్లు తెస్తే, తమ ప్రభుత్వం వాటిని రీ-స్ట్రక్చర్ చేసి 7 శాతానికి తగ్గించిందని, తద్వారా రాష్ట్ర ఖజానాకు మేలు చేస్తున్నామని చెప్పారు. అబద్ధాల ప్రపంచాన్ని సృష్టించడంలో కేసీఆర్ సాటిలేరని, ఆయన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను పదేళ్ల పాటు మోసం చేసిన కేసీఆర్.. ఇరిగేషన్ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము ఎలాంటి రాజకీయం లేకుండా, చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ట్రెడిషనల్ చీరలో మోడర్న్ గ్లామర్.. అనసూయ స్టన్నింగ్ లుక్స్ వైరల్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Vs Brs
  • kcr
  • Palamuru-Rangareddy Project
  • Telangana Irrigation
  • uttam kumar reddy

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

  • PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions