Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uttam Kumar Reddy Slams Brs Irrigation Projects Telangana

Uttam Kumar Reddy : ఘోర తప్పిదాన్ని మళ్లీ సమర్థించుకుంటున్నారు

Published Date :December 22, 2025 , 4:56 pm
By Gogikar Sai Krishna
  • కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
  • కృష్ణా జలాల్లో తెలంగాణకు బీఆర్ఎస్ ద్రోహం
  • పాలమూరు-రంగారెడ్డిపై హరీశ్ రావుకు సూటి ప్రశ్న
  • నల్గొండ జిల్లాకు జరిగిన అన్యాయం బట్టబయలు
Uttam Kumar Reddy : ఘోర తప్పిదాన్ని మళ్లీ సమర్థించుకుంటున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttam Kumar Reddy : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం నుండి కృష్ణా జలాల పంపకాల వరకు బీఆర్ఎస్ నేతలు అనుసరించిన విధానాలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ నేతలు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని, అటువంటి ఘోర తప్పిదాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రూ. 1.80 లక్షల కోట్లు అప్పు తెచ్చి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్ఎస్ ఘనతేనని, ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాగ్ కూడా పేర్కొందని ఆయన గుర్తుచేశారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంది కేవలం 70 నుండి 80 టీఎంసీల నీరు మాత్రమేనని, కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు డిజైన్ మార్చారని ఆరోపించారు.

Also Read

  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
  • Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
  • Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
  • Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’

కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో కేసీఆర్, హరీశ్ రావు తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మంత్రి విమర్శించారు. 2020లో కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణకు 33 శాతం నీరు సరిపోతుందని బీఆర్ఎస్ నేతలు రాసివ్వడం వల్లే ఇవాళ ట్రిబ్యునల్ ముందు ఏపీ బలమైన వాదన వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణకు 71 శాతం వాటా కావాలని కేంద్రానికి, ట్రిబ్యునల్‌కు స్పష్టంగా తెలియజేశామని ఆయన వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ఏపీతో కుమ్మక్కై, అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించుకుని తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని హరీశ్ రావును మంత్రి నిలదీశారు. కనీసం కాలువల తవ్వకం కూడా చేపట్టకుండా, ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా 90 శాతం పనులు పూర్తయ్యాయని అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. “కాల్వలు తవ్వకుండా బకెట్లతో నీరు ఇవ్వాలనుకున్నారా?” అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన రూ. 5000 కోట్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే చెల్లించామని తెలిపారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కక్షతోనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పక్కన పెట్టారని, ఎస్సెల్బీసీ, డిండి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో డిండి ప్రాజెక్టుకు రూ. 1800 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని, బీఆర్ఎస్ నేతలు చేసిన అప్పులకు నెలకు రూ. 16 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అక్రమంగా సంపాదించిన సొమ్మును జేబుల్లో నింపుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Sharath Kumar : విజయ్‌ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Government
  • Kaleshwaram project
  • Krishna Water Dispute
  • Telangana Irrigation
  • uttam kumar reddy

తాజావార్తలు

  • Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

  • NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..

  • OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్‌లో ఎవరు టాప్‌లో నిలుస్తారు?

  • Donald Trump: 14-సూత్రాల ప్లాన్‌తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions