Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
- ఎల్నీనోపై ఉన్నతస్థాయి సమీక్ష
- జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ
- సాగునీరు, ఎరువులపై కీలక ఆదేశాలు
- వదంతులు నమ్మొద్దని రైతులకు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావం, వర్షపాత పరిస్థితులపై రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి జానయ్యతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్నీనో సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
జిల్లా వారీగా కార్యాచరణ.. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
ఎల్నీనో ప్రభావానికి అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణం, వ్యవసాయం, నీటిపారుదల శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. జిల్లాల్లో వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి లభ్యత ఆధారంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామసభల ద్వారా రైతుల్లో ఎల్నీనో ప్రభావంపై చైతన్యం తీసుకురావాలని, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ నీటితో పండే పంటల ఎంపికపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు , సాంకేతిక సలహాలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
Also Read
- Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
- Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్
- Faculty Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..
- CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
సాగునీటి శాస్త్రీయ నిర్వహణ.. ఎరువుల లభ్యతపై ఆదేశాలు
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న సాగునీటిని వృధా కాకుండా అత్యంత శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి పంటలకు అందిస్తామన్నారు. సాగు సీజన్కు అవసరమైన ఎరువులను రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు.
వదంతులు నమ్మవద్దు.. రైతు సంక్షేమమే అత్యున్నత ప్రాధాన్యం
రైతు సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగు విషయాలపై సోషల్ మీడియాలో లేదా బయట వచ్చే ఎలాంటి వదంతులను, పుకార్లను రైతులు నమ్మవద్దని.. కేవలం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఇచ్చే అధికారిక సూచనలనే పాటించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ రైతులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
-
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!