IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
- ఉప్పల్ మ్యాచ్ టికెట్లపై అభిమానుల ఆగ్రహం
- నిమిషాల్లో సోల్డ్ అవుట్ అయిన 39 వేల సీట్లు
- భారీగా పెరిగిన టికెట్ ధరలపై విమర్శలు
- ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియపై సందేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ ప్రేమికులకు ఉప్పల్ స్టేడియం మ్యాచ్ అంటేనే ఒక పెద్ద పండుగ. అయితే, రేపు జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్ల అమ్మకాల వెనుక పెద్ద ఎత్తున దందా నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్కు నగరంలో ఇదే చివరి మ్యాచ్ కావడం, దానికి తోడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ను సన్రైజర్స్ ఫ్రాంచైజీ క్యాష్ చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా రూ. 950 గా ఉండే కనీస టికెట్ ధరను ఏకంగా రూ. 1,950 కి పెంచేయడమే కాకుండా, సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను రూ. 30 వేల నుండి ఒకేసారి రూ. 45 వేలకు పెంచేశారు. దీనివల్ల సామాన్య క్రికెట్ ప్రేమికులకు మ్యాచ్ చూసే అవకాశం పూర్తిగా దూరమైంది. ఇంత భారీగా ధరలు పెంచినా సరే, మ్యాచ్ చూడాలనుకున్న ఫ్యాన్స్కు ఆన్లైన్ బుకింగ్స్లో తీవ్ర నిరాశే ఎదురైంది. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో జరిగిన ఆన్లైన్ టికెట్ సేల్స్ ప్రక్రియ ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
శుక్రవారం సాయంత్రం ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన కేవలం నిమిషాల వ్యవధిలోనే ‘సోల్డ్ అవుట్’ (Sold Out) బోర్డు ప్రత్యక్షం కావడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మొత్తం సామర్థ్యం 39 వేల సీట్లు. ఇందులో విఐపిలు, అధికారులకు ఇచ్చే ఉచిత కాంప్లిమెంటరీ పాసులు పోను.. సుమారు 30 నుండి 32 వేల టికెట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ, ఆన్లైన్ సేల్స్ ప్రారంభం కాగానే దాదాపు 3 లక్షల మందిని క్యూలో చూపించి, అసలు టికెట్లు బుక్ చేసుకునే లోపే వేలాది టికెట్లు కంటికి కనిపించకుండా మాయమైపోయాయి.
ఈ టికెట్ల మాయం వెనుక తెరవెనుక పెద్ద దందా నడిచిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కంటితుడుపుగా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసి, అభిమానులను బురిడీ కొట్టించి మెజారిటీ టికెట్లను బ్లాక్ మార్కెట్కు తరలించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ లో అసలు సాధారణ ప్రజలకు ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంచారు, ఇప్పటివరకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి అనే పూర్తి వివరాలను సన్రైజర్స్ యాజమాన్యం బయటపెట్టకుండా దాచడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!