Kishan Reddy: వరంగల్కు కిషన్ రెడ్డి.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం వరంగల్లో పర్యటించనున్నారు. రేపు పీఎం మోడీ వరంగల్ పర్యటనకు రానున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వరంగల్ కు బయలుదేరారు. ఇవాల ఉదయం కిషన్ రెడ్డి తన నివాసంలో పూజలు చేసిన అనంతరం వరంగల్ బయలు దేరారు. వరంగల్ లో కొలువైన భద్రకాళి అమ్మ వారిని కిషన్ రెడ్డి దర్శించుకోనున్నారు. భద్రాకాళి అమ్మవారి దర్శనం అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మోడీ ప్రసంగించే సభ స్థలిని పర్యవేక్షించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. బీజేపీ కార్యకర్తలకు, సభకు హాజరయ్యా ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని అధికారలును సూచించనున్నారు. కిషన్ రెడ్డి వరంగల్ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాకాళి అమ్మవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రయాణికులు ఇబ్బందులు గురికాకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బుధవారం చేరుకున్న విషయం తెలిసిందే.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కిషన్ రెడ్డి చేరుకోగా, తెలంగాణ ఎన్నికల కమిటీ నిర్వాహక ఛైర్మన్ ఈటల రాజేందర్ సహా రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు జులై 8న మరోసారి తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్లోని రైల్ వ్యాగన్ తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా హెలికాప్టర్లో వరంగల్ ఎయిర్స్ట్రిప్ మీదుగా అక్కడికి వచ్చి భద్రకాళి దర్శనం చేసుకోనున్నారు. వర్చువల్ మోడ్ ద్వారా రైల్వే యూనిట్ ప్రారంభం కానుంది. ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు అధికారులు పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. మరుసటి రోజు (జూలై 9) హైదరాబాద్ లో దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. మార్పులు, చేర్పులు అన్నీ పార్టీ అధిష్టానం ఆలోచించి పార్టీ ఆదేశిస్తే ఏ పని చేసినా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.
Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీకి గుర్తింపు వచ్చింది తెలుగు గడ్డపైనే.. ఆ విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు!
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
తాజావార్తలు
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!