Kishan Reddy : రైతు దీక్ష కాదు, రాజకీయ ఆరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. కేంద్రంపై టీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పుడు బియ్యంగా మార్చకుండా కేంద్రానికి బియ్యం ఇయ్యండని, నూకల చార్జీ మీరు భరించండి.. నూకల వల్ల వచ్చే నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా.. నూకల వల్ల చాలా తక్కువ నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆయన ఆయన వ్యాఖ్యానించారు.
రైతుల విషయంలో రాజకీయం ఎందుకు అంటూ ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ కేంద్రంపై చేసే దుష్ప్రచారాలను రైతులు నమ్మలేదంటూ.. కేసీఆర్ మాట్లాడిన వీడియోలను కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో చూపించారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, కేంద్రానికి అగ్రిమెంట్ ఇచ్చి, ఇప్పుడు రాష్ట్రం సేకరించను అంటుందని ఆయన మండిపడ్డారు. రైతులను ఆగం చెయ్యటం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రా రైస్ చివరి గింజ వరకు కేంద్రం కొంటుందని, టార్గెట్ కంటే ఎక్కువ కొన్నామని, తెలంగాణకు ఒక విధానం, దేశానికి ఒక విధానము లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం ఉందని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇదే విధానము ఉందని ఆయన గుర్తు చేశారు. రైతులను రెచ్చకొట్టటం కోసమే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ లో భూకంపం రాకుండా చూసుకోండని, ధాన్యం సేకరణలో కేంద్రం ఒక్క అడుగు కూడా వెనకడుగు వెయ్యలేదని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ది రైతు దీక్ష కాదు, రాజకీయ ఆరాటం అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
https://ntvtelugu.com/bandi-sanjay-demanded-bc-reservations/
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!