Kishan Reddy : రైతు దీక్ష కాదు, రాజకీయ ఆరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. కేంద్రంపై టీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పుడు బియ్యంగా మార్చకుండా కేంద్రానికి బియ్యం ఇయ్యండని, నూకల చార్జీ మీరు భరించండి.. నూకల వల్ల వచ్చే నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా.. నూకల వల్ల చాలా తక్కువ నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆయన ఆయన వ్యాఖ్యానించారు.
రైతుల విషయంలో రాజకీయం ఎందుకు అంటూ ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ కేంద్రంపై చేసే దుష్ప్రచారాలను రైతులు నమ్మలేదంటూ.. కేసీఆర్ మాట్లాడిన వీడియోలను కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో చూపించారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, కేంద్రానికి అగ్రిమెంట్ ఇచ్చి, ఇప్పుడు రాష్ట్రం సేకరించను అంటుందని ఆయన మండిపడ్డారు. రైతులను ఆగం చెయ్యటం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రా రైస్ చివరి గింజ వరకు కేంద్రం కొంటుందని, టార్గెట్ కంటే ఎక్కువ కొన్నామని, తెలంగాణకు ఒక విధానం, దేశానికి ఒక విధానము లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం ఉందని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇదే విధానము ఉందని ఆయన గుర్తు చేశారు. రైతులను రెచ్చకొట్టటం కోసమే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ లో భూకంపం రాకుండా చూసుకోండని, ధాన్యం సేకరణలో కేంద్రం ఒక్క అడుగు కూడా వెనకడుగు వెయ్యలేదని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ది రైతు దీక్ష కాదు, రాజకీయ ఆరాటం అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
https://ntvtelugu.com/bandi-sanjay-demanded-bc-reservations/
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!