Kishan Reddy: హుజురాబాద్ రిజల్ట్స్.. మునుగోడులో రిపీట్ కాబోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ రేపు సభ పెట్టుకున్న, సభలో కూర్చీవేసుకుని కూర్చున్న భయపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. TRS సభ పెట్టుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు. వాళ్ల మీద, వాళ్ళ నేతల పైన విశ్వాసం లేకనే సభ పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు. ఎన్నికల ముందు బీజేపీనీ బద్నాం చేయడం టీఆర్ఎస్ పార్టీ కి అలవాటే అని విమర్శించారు. 8 యేళ్ళుగా గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ లాగా కుటుంబ పార్టీ కాదని, అవినీతి పార్టీ కాదని స్పష్టం చేశారు. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పడం కేసీఆర్ కి అలవాటే అని విమర్శించారు. కేసీఆర్ కుర్చీ చెప్పిన దగ్గర కాకుండా ఫార్మ్ హౌస్ లో వేసుకుంటారని తెలిపారు.
రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ కు మూడు అసెంబ్లీ లే కనిపిస్తాయని ఎద్దేవ చేశారు. గజ్వేల్ లో సీఎం కొడుకు, సిరిసిల్లలో ఆయన అల్లుడి హరీష్ రావు నియోజక వర్గాలే అని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నడిబొడ్డున అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ అమరుల శవాల మీద కుర్చీలు వేసుకుని తెలంగాణను పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే హీరోల మని వ్యవహరిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎమ్మేల్యే లను జీరో లు చేశారని మండిపడ్డారు. హుజూరబాద్.. మునుగోడులో రిపీట్ కాబోతుందని కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడుతారని తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పీడ, దరిద్రం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
రేపు సాయంత్రం 3 గంటలకు మునుగోడులో సమర భేరి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామన్నా అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు అబివృద్ధికై రాజీనామా చేసి బీజేపీ లో చేరుతున్నాడని, కేంద్ర మంత్రి అభిత్ షా ఈ సభకు హాజరుకానున్నారని తెలిపారు. రేపు బీజేపీ బహిరంగ సభను ఆంక్షల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రేవు రాజగోపాల్ రెడ్డి అమిత షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లాగా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి తరలిచ్చే అలోచన లేదు, అలా చేయం ఒక్క ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలి వచ్చి విజయం వంతం చేయాలని పిలుపు నిచ్చారు. మునుగోడు లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరు స్వచ్ఛందగా బహిరంగ సభకు తరలి రావాలని పిలుపు నిచ్చారు.
India Vs Zimbabwe: రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఫీల్డింగ్కే కేఎల్ రాహుల్ మొగ్గు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!