India Vs Zimbabwe: రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఫీల్డింగ్కే కేఎల్ రాహుల్ మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs Zimbabwe: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా టీమిండియానే టాస్ గెలిచింది. ఈ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ఫీల్డింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపించాడు. తొలివన్డేలో కూడా టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా జింబాబ్వేను 189 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. అదే తరహాలో రెండో వన్డేలో కూడా తక్కువ పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసేలా టీమిండియా ప్రణాళికలు రచించింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ను గెలిస్తే సిరీస్ను సొంతం చేసుకుంటుంది. లేదంటే మూడో వన్డే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవడానికి కేఎల్ రాహుల్ ఇష్టపడలేదు. ఇటీవల ఇంగ్లండ్, వెస్టిండీస్ గడ్డలపై వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న టీమిండియా ఈ సిరీస్ను కూడా కైవసం చేసుకోగలిగితే విదేశీ గడ్డపై హ్యాట్రిక్ వన్డే సిరీస్ సాధించిన జట్టుగా నిలుస్తుంది.
కాగా ఈ వన్డేలో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆల్రౌండర్ దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. దీపక్ చాహర్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ను తీసుకోవడానికి గల కారణాలను కేఎల్ రాహుల్ వెల్లడించలేదు. అటు జింబాబ్వే మాత్రం తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. తడిమనషె మరుమని, రిచర్డ్ ఎంగర్వ స్థానంలో కైటనో, చివంగను తుదిజట్టులోకి తీసుకుంది. అటు గత మ్యాచ్లో తక్కువ లక్ష్యం కావడంతో శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేశారు. లక్ష్యం తక్కువగా ఉండటం వల్ల రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని మిస్సయ్యాడు. మరోవైపు టీమిండియా యువ ఆటగాళ్లు సంజూ శాంసన్, దీపక్ హుడాకు ఈ మ్యాచ్లోనైనా బ్యాటింగ్ చేసే అవకాశమొస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్
జింబాబ్వే: కైటనో, ఇన్నోసెంట్ కియా, సీన్ విలియమ్స్, వెస్లె మధెవెరె, సికందర్ రజా, రెజిస్ చకబ్వా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జొంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, టనక చివంగ
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!