Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు.. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు ఎంతంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తాజాగా కుటుంబ ఆస్తులు, అప్పులను మంత్రి పీఎంవో కార్యాలయానికి సమర్పించారు. అందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన స్థిరాస్తులు, చరాస్తుల విలువ సంవత్సరంలో రూ.54,58,003 తగ్గింది. మార్చి 31, 2022 నాటికి అతని కుటుంబ ఆస్తులు రూ. 17,39,04,250.44 ఉండగా, ఆగస్టు 2023 నాటికి రూ.16,84,46,246.96కి తగ్గింది. అదే సమయంలో అప్పులు కూడా రూ.90,68,948 తగ్గాయి. కిషన్ రెడ్డి కుటుంబం వద్ద గతేడాది రూ.2,45,000 నగదు ఉండగా, ఈ ఏడాది రూ.3,30,000కు చేరింది. అదే సమయంలో ఆస్తుల విలువ రూ.8,82,60,250.44 నుంచి రూ.8,42,49,246.96కి తగ్గింది. మొత్తం కుటుంబ ఆస్తుల నికర విలువ రూ.40.11 లక్షలు తగ్గింది. అదే సమయంలో కుటుంబ స్థిరాస్తి విలువ రూ.8,53,99,000 నుంచి రూ.8,38,67,000కి తగ్గింది.
Read also: Bomb Threat to Gannavaram Airport: గన్నవరం ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపు..
Also Read
హిందూ ఉమ్మడి కుటుంబం పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.40,31,000 తగ్గింది. కొడుకు పేరు మీద ఉన్న స్థిరాస్తి రూ.24.99 లక్షలు పెరిగింది. భార్య పేరు మీద అప్పులు రూ.12,35,448 తగ్గగా, కూతురు పేరిట రూ.78,33,500 తగ్గాయి. కిషన్ రెడ్డి పేరు మీద 1995 మోడల్ మారుతీ 800 కారు (రూ. 40 వేలు) ఉంది. ఇది కాకుండా వారి కుటుంబ సభ్యులకు ఎవరికీ కారు లేదు. హిందూ ఉమ్మడి కుటుంబంలో రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో 8.2850 ఎకరాల వ్యవసాయ భూమి కిషన్రెడ్డికి సంక్రమించింది. ఎకరాకు రూ.8.80 లక్షల చొప్పున రూ.76.67 లక్షలుగా పేర్కొన్నారు. అదే గ్రామంలో 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు ఉన్నట్లు తేలింది. దీని మార్కెట్ విలువ రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు.
కిషన్ రెడ్డి కుమారుడి పేరిట కాచిగూడలో వారసత్వంగా వచ్చిన 122 చదరపు గజాల స్థలంలో భవనం ఉంది. దీని మార్కెట్ విలువ రూ.1,20,19,000గా చూపబడింది. అతని భార్యకు బంజారాహిల్స్లో 425 చదరపు గజాల స్థలం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1,78,50,000. డిసెంబర్ 30, 2021న, ఆమె యూసుఫ్గూడలో రూ.4,57,31,000కి 600 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. దీని మార్కెట్ విలువ కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఆస్తుల్లో కిషన్ రెడ్డి పేరిట మూడు బ్యాంకుల్లో డిపాజిట్లు, క్యాడిలా హెల్త్ కేర్ లో 3 వేల షేర్లు, 2 ఎల్ ఐసీ పాలసీలు ఉన్నాయి. పీఎంవోకు సమర్పించిన వివరాల్లో వైష్ణవి అసోసియేట్స్కు రూ.2 లక్షలు, ఇందిరా లెజిస్లేచర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రూ.5 లక్షలు రుణం ఇచ్చినట్లు వెల్లడించారు.
Viral Video: భలే పిట్ట గురూ ఇది.. దొంగతనం చేసి యజమానికి ఇస్తున్న పక్షి
తాజావార్తలు
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్లో బిగ్ అప్గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
-
Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!