థర్డ్ వేవ్పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. కేంద్రమంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాకముందే.. మరోవైపు థర్డ్ వే భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. అయితే, థర్డ్ వేవ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడదని సూచించారు.. ఇవాళ హైదరాబాద్లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోందన్నారు.. యూరప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. ఇక, ఆక్సిజన్ ప్లాంట్స్, వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.. తెలంగాణకు 1,400 వెంటిలేటర్లను 46 ఆస్పత్రులకు ఇచ్చామని వెల్లడించారు. గత 74 ఏళ్లుగా 18 వేల వెంటిలేటర్లు వినియోగిస్తే.. గత రెండేళ్లలో 50 వేలకు పైగా వెంటిలేటర్లను అదనంగా అందుబాటులోకి తెచ్చామన్నారు..
మరోవైపు 200 కోట్ల వ్యాక్సిన్లను భారత్లో తయారు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. భారత్ బయోటెక్ కి 1500 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కోసం అడ్వాన్స్ ఇచ్చామన్న ఆయన.. థర్డ్ వేవ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడదన్నారు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వాళ్లపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. కేంద్రం వ్యాక్సిన్పై నిర్ణయించిన చార్జీల కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కిషన్రెడ్డి.
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!