Ukraine Crisis: ఉక్రెయిన్ లో కరీంనగర్ యువతి అవస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి కడారి సుమాంజలి ఉక్రెయిన్ లో ఇక్కట్లు పడుతోంది. ఆమె అవస్థలు అన్నీ ఇన్నీకావు. 4 రోజుల నుంచి ఆహారం కూడా లేదని ఆమె ఆవేదన చెందుతోంది. కూతురి కష్టాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఎంబసీ అధికారులు భోజన సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
తమ కూతురు రూంలో వుందన్నారు సుమాంజలి తల్లి. అక్కడి పరిస్థితి బాంబులు పడుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో వున్నా.. సరైన వసతి లేదు. బోర్డర్ రావడానికే అవకాశం లేదంటోంది సుమాంజలి. బాంబు చప్పుడు వినిపిస్తే బంకర్లలోకి వెళుతున్నారు. షాపుల్లో ఏం దొరకడం లేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని, క్షేమంగా ఇంటికి చేర్చాలంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో సుమాంజలి ఇరుక్కుపోయింది. అక్కడినించి సరిహద్దులు దాటాలంటే 800 కిలోమీటర్లు దూరం వుందన్నారు సుమాంజలి అన్న.
Also Read
మరోవైపు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. బుడాఫెస్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంది ప్రత్యేక విమానం. ఢిల్లీకి చేరుకున్నారు 240 మంది భారతీయులు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 1346 మంది భారతీయులను తరలించారు.
తాజావార్తలు
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..