Polytechnic Paper Leak: పరీక్షలు రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పాలిటెక్నిక్ ప్రశ్నా పత్రాలు లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ సాంకేతిక విద్యా మండలి. ఇక, రద్దు చేసిన ఆ రెండు పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి.. ఇదే సమయంలో హైదరాబాద్శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్మండలం బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ నుంచి పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీకయినట్లు అధికారులు గుర్తించారు.. ప్రశ్నాపత్రాల లీక్ను గుర్తించిన ఇతర జిల్లాల్లోని ప్రిన్సిపల్స్ బోర్డుకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది.
Read Also: India vs West Indies: టీమిండియా క్లీన్ స్వీప్.. విండీస్పై చరిత్ర సృష్టించిన రోహిత్ సేన..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఈనెల 8, 9 తేదీల్లో జరిగిన మూడో సెమిస్టర్ అప్లయిడ్ ఇంజినీరింగ్ మేథమేటిక్స్, ఐదో సెమిస్టర్లోఎలక్ట్రికల్ సర్క్యూట్ సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలను కాలేజీ సిబ్బందే.. లీక్ చేసినట్లు సాంకేతిక విద్యామండలి గుర్తించింది.. పరీక్ష ప్రారంభం కాకముంతే ప్రశ్నాపత్రాలు లీక్ చేసి వాట్సాప్ ద్వారా కొందరికి పంపినట్లు సాంకేతిక విద్యామండలి దృష్టికి వచ్చింది.. ఇక, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. పరీక్ష సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, పరిపాలన అధికారి కృష్ణమూర్తి, లెక్చరర్ కృష్ణమోహన్కు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అబ్దుల్లాపూర్ మెట్పీఎస్లో సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, పేపర్ లీకేజీపై కళాశాలలోని డిపార్ట్మెంటల్అబ్జర్వర్పై సాంకేతిక విద్యామండలి చర్యలు తీసుకుంది.. మరోవైపు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు.. అనుమతి ఎందుకు రద్దుచేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. మొత్తంగా ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెక్షన్ 8ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!