చార్మినార్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గంజాయి మాఫియా నే మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా తెలిపారు పోలీసులు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ లో టీ కొట్టు నడుపుకుంటున్న మధుసూదన్ రెడ్డి.. గంజాయి వ్యాపారం చేసే సంజయ్ కుమార్ తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆంధ్ర నుంచి గంజాయి తెచ్చి హైదరాబాదులో విక్రయం చేస్తున్నా సంజయ్ ముఠా.. మధుసూదన్ రెడ్డి కూడా మెల్లగా గంజాయి వ్యాపారంలో దించింది. మధుసూదన్ రెడ్డి తో పాటు సంజయ్, జగన్నాథ్ తో కలిసి గంజాయి వ్యాపారం కొనసాగించారు. గత నెలలో గంజాయి తీసుకు వస్తున్న సంజయ్ అల్లున్ని ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో 40 లక్షలు వరకు మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్న సంజయ్. అయితే తన డబ్బును తిరిగి ఇవ్వాలని సంజయ్ ఒత్తిడి తెచ్చాడు మధుసూదన్ రెడ్డి. ఈ నేపథ్యలో బీదర్ లో డబ్బులు ఇస్తామని చెప్పి కారులో కిడ్నాప్ చేసింది సంజయ్ గ్యాంగ్. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో మధుసూదన్ రెడ్డి ని హత్య చేసిన సంజయ్… సంగారెడ్డి సమీపంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. అనంతరం మధుసూదన్ రెడ్డి తోపాటు జగన్నాథం ను కిడ్నాప్ చేశారంటూ మధుసూదన్ రెడ్డి భార్యకు ఫోన్ చేశాడు సంజయ్. దీంతో చార్మినార్ పోలీసులను ఆశ్రయించింది మధుసూదన్ రెడ్డి భార్య. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం సంజయ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.