Group 1 Prelims: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పిటిషన్.. మే 25న హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఫలితాల అనంతరం రద్దు చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించేందుకు టీఎస్ పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 36 మంది అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. గ్రూప్ 1ని రెండు నెలల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు తమ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్లపై ఈనెల 25న హైకోర్టు విచారణ చేపట్టనుంది.
పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతున్న విచారణ..
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సి) రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. ఓ వైపు నిందితులను విచారిస్తూనే.. క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. గ్రూప్-1 ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులను 5 గ్రూపులుగా ఏర్పాటు చేసిన అధికారులు ప్రశ్నించారు. ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థులు విద్యార్హత, గ్రూప్-1 ప్రిలిమ్స్ మార్కులు, ఎక్కడ శిక్షణ పొందారు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వివరాలు సేకరిస్తారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితుడైన రాజశేఖర్ రెడ్డితో అభ్యర్థులకు స్నేహం, బంధుత్వం ఉందా అని కూడా ఆరా తీశారు. నగదు వ్యవహారం వెలుగులోకి రావడంతో పేపర్ లీకేజీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది.
వాట్సాప్ ద్వారా ‘గ్రూప్-1’ ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు చేతులు మారినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితులు ప్రశ్నపత్రాలను పకడ్బందీగా పంచుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. కేసు ఈడీకి వెళ్లింది. టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యాలయ కేంద్రంలోనే ఈ వ్యవహారమంతా కొనసాగినట్లు అంచనా. తాజాగా అరెస్టయిన అసిస్టెంట్ సెక్షన్ అధికారులు షమీమ్, నలగోపుల సురేష్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేష్ కుమార్ రిమాండ్ రిపోర్టులో అధికారులు రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావించారు. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డి న్యూజిలాండ్ లో ఉంటున్న తన బావమరిది ప్రశాంత్ రెడ్డికి పేపర్ ను వాట్సాప్ లో షేర్ చేశాడు. అతనికి నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రధాన నిందితుల్లో ఒకరైన రేణుక బెయిల్ పొంది ఇప్పటికే జైలు నుంచి విడుదలైంది.
Vaibhavi Upadhyaya: కారు ప్రమాదంలో ప్రముఖ నటి మృతి
తాజావార్తలు
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!