Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ts Legislative Council Live Updates

TS Legislative Council : శాసన మండలిలో ఎవరేమన్నారు..!

Published Date :March 15, 2022 , 3:45 pm
By Gogikar Sai Krishna
TS Legislative Council : శాసన మండలిలో ఎవరేమన్నారు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Legislative Council Live Updates.

మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కార్యాలయం పనులను తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారని అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బస్సుల సంఖ్య తగ్గించకుండా ప్రజా రవాణాను అందరికి అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు బకాయి పడిన రెండు పీఆర్సీలు, రెండు డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. రేండేళ్లు ఆర్టీసీ సంఘాలు ఉండకూడదన్నారు, ఇప్పుడు రెండేళ్లు గడిచిపోయిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని నర్సిరెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని మరో సభ్యుడు ఎమ్మెస్‌ ప్రభాకర్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పొడు భూములకు హక్కులు కల్పించాలని సీనియర్‌ సభ్యులు జీవన రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అటవీ భూముల పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ భూములను కూడా పొడు భూములుగా చూపిస్తూ ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములకు జాతీయ బ్యాంక్ లు రుణాలు ఇస్తున్నారు కానీ సహకార సంఘాల బ్యాంక్ లు ఇవ్వడం లేదని, అలాగే ధాన్యం సేకరణ కేంద్రాలను తెరవాలని కోరారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలో ప్రభుత్వ మండల కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు దండె విఠల్. నెల్లికల్ ప్రాజెక్ట్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఎమ్‌సీ కోటిరెడ్డి కోరారు. ఇక, 90,000 ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు ప్రకటించినందుకు గాను సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు వాణీదేవి. పోటీ పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంధాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షల పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని గ్రంధాలయాల్లో ఉద్యోగార్థులకు అందుబాటులో ఉంచాలని ఆమె ప్రభుత్వానికి సూచించారామె.

రెండవ విడత గొర్రె పిల్లలను వెంటనే పంపిణీ చేయాలని ఎగ్గే మల్లేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో రంజాన్ ఉన్నందున అన్ని జిల్లా కలెక్టర్లతో ఉన్నతాధికారుల తో సమావేశం ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ సమావేశానికి జిల్లాలో ఉన్న ముస్లిం నాయకులను కూడా ఆహ్వానించాలని ఫారూక్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు.

1996 బ్యాచ్ ఇన్స్‌పెక్టర్లలో వరంగల్ జోన్ మినహా మిగతా వారికి ప్రమోషన్లు ఇచ్చారని, వరంగల్ జోన్ కు చెందిన వారికి కూడా పదోన్నతి కల్పించాలని బానుప్రసాద్ హోం శాఖను కోరారు. దళిత బంధు, రైతు బంధు పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు.

మరోవైపు, మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపడంతో సభ్యులకు, సభకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్భంగా మండలిలో జరిగిన చర్చలో సభ్యులు కల్వకుంట్ల కవిత, వెంకట్రామ్ రెడ్డి, గంగాధర్ గౌడ్ లు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పటానికి బదులు కావాలని రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు కల్వకుంట్ల కవిత.

రాజకీయం కోసమే ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరమిదికి తీసుకు వచ్చారని జీవన్ రెడ్డి అన్నారు. మున్సిపాల్టీలతో పాటు కార్పొరేషన్ పరిధిలో ఉన్న మార్కెట్ కమిటీలలో చేస్తున్న వారికి కూడా మార్కెట్ కమిటీలలో ప్రభుత్వం తీసుకువచ్చిన అమెండమెంట్ బిల్లును అమలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

రైతు బంధు వస్తున్న ప్రతి ఇంట్లో కేసీఆర్ బొమ్మ ను ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలన్నారు వెంకట రామిరెడ్డి. కేంద్రం వ్యవసాయ మార్కెట్లను తొలగిస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు కల్పించి వాటిని అభివృద్ధి చేస్తున్నారని ఆయన కొనియాడారు.

https://ntvtelugu.com/cpi-ramakrishna-made-comments-on-ycp/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kalvakuntla kavitha
  • LATEST TELUGU NEWS
  • mlc
  • telangana legislative council

తాజావార్తలు

  • Corporate Jihad: నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్.. నమాజ్ చేస్తేనే సాలరీ హైక్..

  • KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు

  • Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

ట్రెండింగ్‌

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions