Sunitha Mahender Reddy: జెడ్పి ఛైర్ పర్సన్ వాహనంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ లో రాజకీయాలు వేడెక్కాయి. జెడ్పి ఛైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి వాహనంపై ఎమ్మెల్యే ఆనంద్ అనుచరుల దాడి హాట్ టాపిక్ మారింది. అయితే.. జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పై ఎమ్మెల్యే కావాలనే తన కారుపై దాడి చేయించి.. తన వర్గంతో అడ్డుకున్నాడని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఆనంద్ అందరిని కలుపుకొని పోకుండా చిల్లర రాజకీయాలు చేస్తుండంపై ఆమె మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తన వ్యవహార శైలి మార్చుకోవాలి అన్నారు. ప్రోటోకాల్ ఎలా పాటించాలో మాకు తెలియదా..? మాకు ప్రజల మద్దతు ఉంది. ఆనంద్ వ్యవహార శైలితో కార్యకర్తలందరూ అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఉద్యమ కారులకు నామినేటేడ్ పదవులు ఇవ్వకుండా తన చెప్పుచేతల్లో ఉండే రియలెస్టేట్ వ్యాపారులకు, డాక్టర్లకు పదవులు కట్టబెడుతున్నాడని మండిపడ్డారు.
read also: Kakani Govardhan Reddy: పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి నిష్క్రమించాలి
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
గతంలో తన పేరు పక్కన తాను చదివిన డిగ్రీలు లేవని, శీలాఫలకాలను పగులగొట్టి ఉంచిన ఘణత ఆనంద్ కుందని ఆమో ఆరోపించారు. ప్రతి చిన్న విషయాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లొద్దనే ఇన్నాళ్లు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మండిపడ్డారు. త్వరలోనే ఆనంద్ ను జిల్లా పార్టీ పదవి నుంచి తప్పిస్తారని సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జెడ్పి ఛైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి వాహనం పై దాడి చేసినవారిపై కఠిచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తన కారు అద్దాలు ద్వంసం చేసారని, ఖచ్చితంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని సునీతా మహేందర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?