TRS vs BJP: మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ
Clash between TRS and BJP parties in Mancherial district: మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగాయి. కర్రలు, చెప్పులతో రెండు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నిరసన తెలియజేస్తుంటే.. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలిపాయి. మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు గో బ్యాక్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. దీనికి పోటీగా బై బై మోదీ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో.. ముందుగా వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
Read Also: Kishan Reddy: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టీఆర్ఎస్ ఆరోపణలు..
Also Read
వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెస్య్కూ సిబ్బంది, పోలీసులు ఇరు వర్గాలను విడదీసే ప్రయత్నం చేసినా.. కూడా ఇరు పార్టీ కార్యకర్తలు ఘర్షణ ఆపలేదు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఇదే విధంగా కేంద్రం పెంచిన జీఎస్టీపై టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కూడా ఆందోళనలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా ఐబీ చౌరస్తాకు చేరుకోవడంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి, పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. రెండు పార్టీల నాయకులు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. బీజేపీ మహిళా నాయకురాలు ఘర్షణలో కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!