Kishan Reddy: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టీఆర్ఎస్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy’s comments on TRS: జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) కింద కేంద్ర తెలంగాణకు ఎటువంటి సాయం చేయలేదని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు విపత్తుల సహయ నిధుల కింది రూ. 3000 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. ఇందులో 2018 నుంచి రూ. 1500 కోట్లు విడుదల చేసిందని గణాంకాలతో సహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, తెలంగాణకు ఎటువంటి సాయం చేయలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మీడియాలో ప్రకటనలు చేస్తుందని విమర్శించారు. భారత ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదని తప్పుడు ప్రచారాాలు చేస్తున్నారని విమర్శించారు.
Read Also: Ginna: కూతుళ్ళ గురించి మనసులో మాట చెప్పిన మంచు విష్ణు!
Also Read
2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరదలు, 2022 గోదావరి వరదలు కానీ విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని.. 2020-21లో హైదరాబాద్ వరదల సమయంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి సుమారు రూ.599 కోట్లు ఇవ్వగా ఇందులో కేంద్రం వాటా కింద రూ. 449 కోట్లను రెండు విడతల్లోె రూ 224.5 కోట్ల చొప్పున విడుదల చేశామని వెల్లడించారు. 2020-21లో తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, రాష్ట్ర వాటాతో కలిపి రూ. 1500 కోట్ల అని.. ఇందులో రూ. 1200 కోట్లు భారత ప్రభుత్వ వాటా అని వెల్లడించారు. ఇదే ఏడాది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి (ఎన్డీఆర్ఎఫ్) మొత్తం రూ. 479.2 కోట్లు కేటాయిస్తే ఇందులో కేంద్రం వాటా రూ. 359.20 కోట్లని వెల్లడించారు. 2022-23 సంవత్సరానికి మొత్తం రూ. 377.60 కోట్లు కేటాయించబడ్డాయని.. అయితే పెండింగ్ లో ఉన్న యుటిలైజేషన్ సర్టిఫికేట్లు, వార్షిక నివేదికలు, ఇతరత్రా పత్రాలు సమర్పించిన తర్వాత డబ్బులను కేంద్ర విడుదల చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో హోం మంత్రిత్వ శాఖ తెలంగాణకు పూర్తి సహాయ, సహకారాలకు హామీ ఇచ్చిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని ‘నీట్’లో ర్యాంక్..
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!