Site icon NTV Telugu

సింగ‌రేణి మూత‌కు బీజేపీ కుట్ర‌..! అందుకే వేలం..

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వ‌తి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని విమ‌ర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగ‌రేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోంద‌ని విమ‌ర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి విరుద్ధ‌మ‌ని దుయ్య‌బ‌ట్టిన ఆమె.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో, దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించింద‌న్నారు.. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ, 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోంద‌ని.. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ, కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంద‌ని ప్ర‌క‌టించారు ఎమ్మెల్సీ క‌విత‌..

Read Also: తెలంగాణ‌కు మొండి చేయి.. బీజేపీ ఎంపీలు విఫ‌లం..!

Exit mobile version