Balka Suman: ప్రధాని పోస్ట్ శాశ్వతం కాదు.. కావాలనే మా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman: ప్రధాని పోస్ట్ శాశ్వతం కాదని, కావాలనే మా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారని రామగుండంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత్ బయోటెక్ వచ్చినప్పుడు క్రెడిట్ కోసం ప్రధాని ఒక్కరే వెళ్లారని అన్నారు. పీఎంవో నుంచి సీఎంఓకు గెస్ట్ ఆప్ ఆనర్ గా పిలవడం ఆనవాయితీ అని తెలిపారు. కానీ పిఎంవో నుంచి ఆహ్వానం లేదని అన్నారు. ఎరువుల శాఖ మంత్రి పేరుతో కేవలం పాల్గొనాలి అని మరోసారి అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇది తెలంగాణ సమాజం నాలుగు కోట్ల జనాల్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వైఖరిని ప్రశ్నిస్తున్న తీరు బాధాకరమన్నారు. సింగరేణి ని ప్రైవేటు పరం చేయమన్నారు రేపు ప్రకటించాలని, కార్మికులకు పెన్షన్ పెంచుతామన్నారు.. ఆ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 11వ వేతన ఒప్పందం అమలు చేస్తామని ప్రకటించాలని అన్నారు. సీసీఐని ఆదిలాబాద్ జిల్లాలో పునర్ ప్రారంభం చేస్తామని చెప్పాలని అన్నారు. 14 నెల్ల కిందట ప్రారంభం అయిన ఎరువుల కర్మాగారం ఇప్పుడు మళ్లీ ప్రారంభించడం ప్రధాని డ్రామా అని మండిపడ్డారు.
read also: Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
10 మెడికల్ కాలేజీలు ఇస్తామని ప్రకటించాలని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందీ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించాలని తెలిపారు. తెలంగాణ పై ప్రేమ ఉంటే అన్నీ విషయాలపై ప్రకటించాలని అన్నారు. మీరు రామగుండం కు ఎందుకు వస్తారో మాకు తెలియదన్నారు. మీ దోస్తు అదానీకి,సింగరేణి బ్లాకులుని అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ లో మైన్ లు అక్కడి వారికి ఇస్తారు.. తెలంగాణ సింగరేణిలో ఇక్కడి వారికి ఇవ్వరని మండిపడ్డారు. కిషన్ రెడ్డికి సిగ్గు ఉందా సీఎంను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎన్నాళ్ళు ఊడిగం చేస్తారు గుజరాత్ వాళ్లకు అని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రధాని గతంలో రెండుసార్లు వచ్చినప్పుడు ఆనాడు మా సీఎం కేసీఆర్ వస్తాం అంటే రావొద్దు అన్నారని గుర్తు చేశారు. రెండు సందర్భాల్లో కూడా అవమానించారని అన్నారు. ప్రధాని పోస్ట్ శాశ్వతం కాదని, కావాలని మా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారని మండిపడ్డారు.
Gudivada Amarnath: ప్రధాని మోడీ-పవన్ భేటీపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వారికి ఓట్లు, సీట్లు రెండూ లేవు..!
తాజావార్తలు
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!