యాదాద్రికి 6 కిలోల బంగారం విరాళం ఇవ్వనున్న టీఆర్ఎస్ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఎంతో మంది ధన రూపేన, వస్తు రూపేన కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలు యాదాద్రి ఆలయానికి విరాళం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ఎం. హనుమంత రావు, ఎం కృష్ణ రావుతో పాటు కెపి వివేక్ ఆనంద్ లు ఒక్కొక్కరు కిలో బంగారాన్ని యాదాద్రి లక్ష్మినరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణానికి సమర్పించనున్నట్లు తెలిపారు.
నిన్ననే సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. అంతేకాకుండా ఆలయ ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా యాదాద్రి ఆలయం ప్రత్యేకత సంతరించుకునేలా శిలానైపుణ్యాలతో ఆలయ నిర్మాణం కళ్లు చమక్కుమనేలా తీర్చిదిద్దినట్లు ఇప్పటికే తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఆలయాన్ని ప్రారంభించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!