యాదాద్రికి 6 కిలోల బంగారం విరాళం ఇవ్వనున్న టీఆర్ఎస్ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఎంతో మంది ధన రూపేన, వస్తు రూపేన కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలు యాదాద్రి ఆలయానికి విరాళం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ఎం. హనుమంత రావు, ఎం కృష్ణ రావుతో పాటు కెపి వివేక్ ఆనంద్ లు ఒక్కొక్కరు కిలో బంగారాన్ని యాదాద్రి లక్ష్మినరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణానికి సమర్పించనున్నట్లు తెలిపారు.
నిన్ననే సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. అంతేకాకుండా ఆలయ ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా యాదాద్రి ఆలయం ప్రత్యేకత సంతరించుకునేలా శిలానైపుణ్యాలతో ఆలయ నిర్మాణం కళ్లు చమక్కుమనేలా తీర్చిదిద్దినట్లు ఇప్పటికే తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఆలయాన్ని ప్రారంభించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!