రేవంత్కు వంటేరు సవాల్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం అయినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఆ సభకు 2 లక్షల మంది వరకు వచ్చినట్టు లెక్కలు వేస్తున్నారు.. అయితే, దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 8 ఎకరాల్లో 2 లక్షల మంది ఎలా పడతారు? అని ప్రశ్నించారు.. గజ్వేల్ కాంగ్రెస్ సభకు 2 లక్షల మంది వచ్చినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ఆయన.. మరి 2 లక్షల మంది రానట్లు అయితే పీసీసీకి రాజీనామా చేస్తావా? అంటూ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మిస్తున్నారని ఫైర్ అయిన వంటేరు.. ఆయనతో కలిసి నేను 8 ఏళ్లు పనిచేశాను.. ఆయన ఒక డ్రామా కంపెనీ.. జై కొట్టే వాళ్లు – విజిల్ వేసే వాళ్లు ఆయన మనుషులే వుంటారన్నారు. రేవంత్ కి దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలన్న ఆయన.. పథకాల పై విమర్శలు చేసే ప్రతి కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు అని సలహా ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి 35 వేల మంది ఉంటే- టీఆర్ఎస్ పార్టీకి 61 లక్షల మంది సభ్యత్వం ఉందన్న ఆయన.. గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు చెప్పారని కామెంట్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!